దీపావళి సెలవుల్లో ప్రభుత్వం మార్పు చేసింది. ఐచ్ఛిక సెలవు అక్టోబర్ 18కి, సాధారణ సెలవును 19కి మార్పు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 18న పండగ సెలవుగా ప్రభుత్వం ఇంతకుముందు ప్రకటించింది. అయితే..19న అమావాస్య వస్తుండటం.. అదే రోజున దీపావళి జరుపుకోవాలని పలువురు పండితులు ప్రభుత్వాన్ని కోరడంతో ఈ మార్పు చేశారు.
ఉద్యోగులు కూడా కోరడంతో.. నరక చతుర్దశి ఐచ్చిక సెలవును.. 17 నుంచి 18కి మార్చారు. దీంతో 18, 19 తేదీల్లో దీపావళి సెలవులు వచ్చాయి.
ఉద్యోగులు కూడా కోరడంతో.. నరక చతుర్దశి ఐచ్చిక సెలవును.. 17 నుంచి 18కి మార్చారు. దీంతో 18, 19 తేదీల్లో దీపావళి సెలవులు వచ్చాయి.