యాప్నగరం

ఒడిశాకి బాసటగా తెలంగాణ సర్కారు.. తరలి వెళ్లిన ‘విద్యుత్’ ఉద్యోగులు

ఫణి తుఫాను కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఒడిశా రాష్ట్రాన్ని ఆదుకునేందుకు తెలంగాణ సర్కారు ముందుకొచ్చింది.

Samayam Telugu 7 May 2019, 11:45 pm
ఫణి తుఫాను కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఒడిశా రాష్ట్రాన్ని ఆదుకునేందుకు మిగతా రాష్ట్రాలు, సెల్రబిటీలు ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఏపీ సర్కారు రూ.15 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కోటి రూపాయల విరాళం ప్రకటించారు. తుఫాన్ కారణంగా ఒడిశాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల కోసం తెలంగాణ ప్రభుత్వం 1000 మంది ఉద్యోగులు మంగళవారం ఒడిశాకు పంపింది. ఈ విషయాన్ని తెలంగాణ సీఎంవో ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
Samayam Telugu kcr naveen1


భారీగా వీచిన తుఫాను గాలుల ప్రభావం వల్ల ఒడిశాలో విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి, కరెంట్ వైర్లు తెగిపోయాయి. దీంతో చాలా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో డీజిల్ జనరేటర్ల ద్వారా అత్యవసర సేవలను అందిస్తున్నారు.

విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం తమకు సహకరించాలని నవీన్ పట్నాయక్ సర్కారు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. వెంటనే స్పందించిన సీఎం కేసిఆర్.. చీఫ్ సెక్రటరీ ఎస్.కె.జోషి, ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావుతో మాట్లాడారు. ఒడిశాకు సహాయం చేయాలని ఆదేశించారు. దీంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసంరాష్ట్రంలోని వివిధ విద్యుత్ సంస్థలకు చెందిన 1000 మంది ఉద్యోగులను మంగళవారం రాత్రి ఒడిశాకు పంపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.