తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర ప్రదేశ్కు సమీపంలో 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఉత్తర కోస్తాలో ఒడిశా పరిసరాల్లో ఇప్పటికే 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ కారణంగా ఉత్తర బంగాళాఖాతం పరిసరాల్లో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురవవచ్చని వెల్లడించారు.
మరోవైపు.. బుధవారం (జులై 11) రాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. వర్షం కారణంగా మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్, కన్నెపల్లి పంప్హౌజ్, గ్రావిటీ కెనాలు వద్ద ఏడో రోజు పనులు నిలిచిపోయాయి.
హైదరాబాద్ నగరంలోని గురువారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. మలక్పేట, దిల్సుఖ్నగర్, సైదాబాద్, చంపాపేట, కోఠి, అబిడ్స్ తదితర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.
ఉప్పొంగుతున్న గోదావరి..
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో వాగులు పొంగడం, చెరువులు మత్తడి పోయడంతో వరద నీరంతా గోదావరికి చేరుతోంది. బుధవారం సాయంత్రానికి భధ్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 30.4 అడుగులకు చేరింది.
మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ వర్షాలతో గోదావరికి వరద నీరు భారీగా వస్తోంది. దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద గోదావరి నీటి మట్టం 13.5 అడుగులకు చేరింది. చర్ల మండలంలోని తాలిపేరు రిజర్వాయర్లోకి భారీగా వరదనీరు చేరడంతో రెండు గేట్లు ఎత్తి 1900 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
నిండుకుండలా కడెం ప్రాజెక్టు..
భారీ వర్షాలతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి 23 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుతం 698 అడుగులకు చేరింది. వరద ఉద్ధృతి పెరగడంతో ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి.. దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కుమ్రంభీం ప్రాజెక్టుకు కూడా వరద ఉద్ధృతి పెరిగింది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ఇప్పటికే జలకళ సంతరించుకున్న విషయం తెలిసిందే.
అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురవవచ్చని వెల్లడించారు.
మరోవైపు.. బుధవారం (జులై 11) రాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. వర్షం కారణంగా మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్, కన్నెపల్లి పంప్హౌజ్, గ్రావిటీ కెనాలు వద్ద ఏడో రోజు పనులు నిలిచిపోయాయి.
హైదరాబాద్ నగరంలోని గురువారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. మలక్పేట, దిల్సుఖ్నగర్, సైదాబాద్, చంపాపేట, కోఠి, అబిడ్స్ తదితర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.
ఉప్పొంగుతున్న గోదావరి..
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో వాగులు పొంగడం, చెరువులు మత్తడి పోయడంతో వరద నీరంతా గోదావరికి చేరుతోంది. బుధవారం సాయంత్రానికి భధ్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 30.4 అడుగులకు చేరింది.
మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ వర్షాలతో గోదావరికి వరద నీరు భారీగా వస్తోంది. దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద గోదావరి నీటి మట్టం 13.5 అడుగులకు చేరింది. చర్ల మండలంలోని తాలిపేరు రిజర్వాయర్లోకి భారీగా వరదనీరు చేరడంతో రెండు గేట్లు ఎత్తి 1900 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
నిండుకుండలా కడెం ప్రాజెక్టు..
భారీ వర్షాలతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి 23 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుతం 698 అడుగులకు చేరింది. వరద ఉద్ధృతి పెరగడంతో ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి.. దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కుమ్రంభీం ప్రాజెక్టుకు కూడా వరద ఉద్ధృతి పెరిగింది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ఇప్పటికే జలకళ సంతరించుకున్న విషయం తెలిసిందే.