యాప్నగరం

ముస్లింలకు తెలంగాణ ఎంతో సురక్షితం: అసదుద్దీన్ ఒవైసీ

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)తో తమ స్నేహం కొనసాగుతుందని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కె.చంద్రశేఖర్‌రావును తెలంగాణ ప్రజలు మళ్లీ సీఎం పీఠంపై కూర్చోబెడతారనే నమ్మకం తనకుందన్నారు.

Samayam Telugu 16 Nov 2018, 12:45 pm
తెలంగాణ ముస్లింలకు అత్యంత సురక్షితమైన రాష్ట్రమని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. గడిచిన నాలుగన్నరేళ్లలో దేశంలోని పలుచోట్ల మైనారిటీలపై మతపరమైన దాడులు జరిగాయని, అయితే తెలంగాణలో మాత్రం ఒక్క మతపరమైన అల్లరి జరగలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ఇంగ్లిష్ పత్రికతో మాట్లాడిన అసదుద్దీన్.. ఎన్నికల నేపథ్యంలో బీజేపీని పరోక్షంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)తో తమ స్నేహం కొనసాగుతుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కె.చంద్రశేఖర్‌రావును తెలంగాణ ప్రజలు మళ్లీ సీఎం పీఠంపై కూర్చోబెడతారనే నమ్మకం తనకుందన్నారు.
Samayam Telugu Asaduddin


‘రాష్ట్రంలో మతపరమైన అల్లర్లు ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. దేశంలో ఇతర చోట్ల జరుగుతోన్న దాడులకు ప్రజలు బలైపోతున్నారు. అల్లమూకల దాడులు, హత్యలు, నగరాల పేర్లు మార్చడం ఇలాంటివన్నీ ప్రజలపై ప్రభావం చూపుతున్నాయి’ అని ముస్లింలు, దళితులపై జరుగుతోన్న దాడులను ఉద్దేశించి అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఒక అబ్బాయి, అమ్మాయి కలిసి నడుచుకుంటూ వెళ్తుంటే వారిని ఎవరూ ఆపరని, వారి మధ్య సంబంధాన్ని ఎవరూ అడగరని అసదుద్దీన్ చెప్పారు. అలాంటి వాతావరణం ఇక్కడ లేదని అన్నారు. బజరంగ్ దళ్ వంటి కాషాయ దళాలను ఉద్దేశించి అసద్ ఈ వ్యాఖ్యలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.