యాప్నగరం

తెలంగాణ ఎవరి భిక్ష కాదు, షబ్బీర్ Vs కేటీఆర్

తెలంగాణ శాసనమండలిలో మంత్రి కేటీఆర్, మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది.

Samayam Telugu 21 Dec 2016, 1:04 pm
తెలంగాణ శాసనమండలిలో మంత్రి కేటీఆర్, మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ భిక్ష అని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. దీంతో అధికార టిఆర్ఎస్ సభ్యులు షబ్బీర్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. అటు మండలి స్పీకర్ స్వామిగౌడ్ సైతం షబ్బీర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Samayam Telugu telangana issue hit council shabbir takes on trs govt
తెలంగాణ ఎవరి భిక్ష కాదు, షబ్బీర్ Vs కేటీఆర్


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒకరి భిక్ష వల్ల ఏర్పాటు కాలేదని, కేవలం ప్రజల పోరాటాల వల్లే సాధ్యమైందని మంత్రి కేటీఆర్ కు షబ్బీర్ కు కౌంటర్ ఇచ్చారు. స్వామి గౌడ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్ అంటూ షబ్బీర్ చేసిన వ్యాఖ్యలను రికార్డులను నుంచి తొలగిస్తున్నట్లు స్వామి గౌడ్ స్పష్టం చేశారు.

తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం చెల్లించే ఎక్స్ గ్రేషియాపైనా షబ్బీర్ అలీ ఆరోపణలు చేశారు. అమరవీరులపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదని కేటీఆర్ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.