యాప్నగరం

మరో 25 ఏళ్లు కేసీఆరే సీఎం..!

తెలంగాణ రాష్ట్ర అవిర్భావం తర్వాత ఏర్పాటైన టీఆర్‌ఎస్ ప్రభుత్వ అద్భుతంగా పాలిస్తోందని, ఎవరూ ఊహించని రీతిలో..

TNN 15 Jun 2017, 6:00 pm
తెలంగాణ రాష్ట్ర అవిర్భావం తర్వాత ఏర్పాటైన టీఆర్‌ఎస్ ప్రభుత్వం అద్భుతంగా పాలిస్తోందని, ఎవరూ ఊహించని రీతిలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళుతోందని ఐటీ, పురపాలక శాఖా మంత్రి కేటీఆర్‌ అన్నారు. గురువారం (జూన్ 15) ఆయన ఖమ్మం జిల్లా దంసలాపురం ఆర్‌వోబీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. మరో పాతికేళ్ల పాటు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారని పేర్కొన్నారు. ‘ప్రత్యేక రాష్ట్రం వస్తే ఏమొస్తుందని మాట్లాడిన వారికి అభివృద్ధితోనే సమాధానం చెబుతున్నాం. ఇంకా ఎన్నికలకు రెండేళ్లు ఉన్నాయి, ఎలాంటి ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్‌దే విజయం. టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని వాటిని కూడా అమలు చేస్తోంది. బడుగు, బలహీన వర్గాలవారి కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి పనులను చేపడుతోంది’ అని అన్నారు.
Samayam Telugu telangana it minister ktrs khammam tour
మరో 25 ఏళ్లు కేసీఆరే సీఎం..!


దశాబ్దాల దంసలాపురం రైల్వే వంతెన ఇప్పటికి సాకారమవడం అదృష్టమని కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మరో మంత్రి.. తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం - బోనకల్‌ రహదారిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరించనున్నట్టు పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.