తెలంగాణలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. జేఏసీ ఛైర్మన్ కోదండరాం నేతృత్వంలో తెలంగాణ జనసమితి ప్రారంభమయ్యింది. పార్టీని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈ నెల 4న జెండా ఆవిష్కరిస్తామని... 29న బహిరంగ సభను కూడా నిర్వహిస్తామని కోదండరాం తెలిపారు. సభలో పార్టీ విధి విధానాలు, ఎజెండాను ప్రకటిస్తామన్నారు. అన్నీ ఆలోచించి పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని... ఇకపై ప్రజల్లోకి వెళతామన్నారు. తెలంగాణలో రైతులు చాలా అసంతృప్తితో ఉన్నారని... ఉద్యోగాల భర్తీ కూడా అలాగే నిలిచిపోయిందన్నారు.
సీఎం కేసీఆర్పైనా కోదండరాం మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామిక విలువలకు గౌరవం లేకుండా పోయిందని... మంత్రులకు సంబంధం లేకుండా సీఎం నిర్ణయాలు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. సెక్రటేరియెట్కు రాని సీఎంను తెలంగాణలోనే చూస్తున్నామని... ధర్మ గంట కొట్టినా సీఎం దర్శనం కలగడం లేదన్నారు. రాజకీయాలపట్ల ద్వేషం లేదని... రాజకీయాలకు సమాజానికి గుండెలాంటివన్నారు.
సీఎం కేసీఆర్పైనా కోదండరాం మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామిక విలువలకు గౌరవం లేకుండా పోయిందని... మంత్రులకు సంబంధం లేకుండా సీఎం నిర్ణయాలు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. సెక్రటేరియెట్కు రాని సీఎంను తెలంగాణలోనే చూస్తున్నామని... ధర్మ గంట కొట్టినా సీఎం దర్శనం కలగడం లేదన్నారు. రాజకీయాలపట్ల ద్వేషం లేదని... రాజకీయాలకు సమాజానికి గుండెలాంటివన్నారు.