యాప్నగరం

అక్టోబరు 31 న ‘కొలువుల కొట్లాట’

అక్టోబరు 31న నిర్వహించ తలపెట్టిన ‘కొలువుల కొట్లాట’ సభను జరిపి తీరుతామని తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ కోదండరామ్‌ స్పష్టం చేశారు.

TNN 28 Oct 2017, 3:34 pm
అక్టోబరు 31న నిర్వహించ తలపెట్టిన ‘కొలువుల కొట్లాట’ సభను జరిపి తీరుతామని తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ కోదండరామ్‌ స్పష్టం చేశారు. సభకు నిరుద్యోగులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాల కోసమే తెలంగాణ తెచ్చుకున్నామని.. ప్రస్తుతం ఉద్యోగాల కోసమే పోరాడుతున్నామన్నారు. సభకు అనుమతి కోసం పోలీసులకు దరఖాస్తు చేసినా.. జాప్యం చేశారని తెలిపారు. కోర్టు నుంచి సానుకూల తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సభను తప్పకుండా, యథాతథంగా జరిపి తీరుతామని కోదండరామ్ స్పష్టం చేశారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని అడగటం లేదని.. ప్రస్తుతం ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని మాత్రమే కోరుతున్నామని ఆయన డిమాండ్ చేశారు.
Samayam Telugu telangana jac will conducted koluvula kotlata on october 31
అక్టోబరు 31 న ‘కొలువుల కొట్లాట’


పౌరులకు ఉద్యోగం, ఉపాధి కల్పన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన గుర్తుచేశారు. పొరుగు సేవల సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సభలు పెడితే ఏం కారణాలు చెప్పారో.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అదే కారణాలు చెబుతోందన్నారు. ఆంధ్రా పాలకుల కంటే దుర్మార్గంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కోదండరాం ఆరోపించారు. ఎల్బీనగర్‌లో సభ నిర్వహణకు అనుమతి ఇవ్వకపోతే ఎన్టీఆర్ మైదానంలో జరిపి తీరుతామని కోదండరాం పునరుద్ఘాటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.