టీవీ రిమోట్ మామా, అల్లుళ్ల మధ్య పంచాయితీ తెచ్చి పెట్టింది. ఒకరేమో క్రికెట్ చూడాలని... మరొకరేమో సీరియల్ అని. ఆ రిమోట్ కోసం మొదలైన గొడవ ఏకంగా ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘటన కలకలంరేపింది. బీర్కూర్ మండలం బరంగెడ్గికి చెందిన బుజ్జయ్య తన కూతురికి పెళ్లి చేసి... అల్లుడ్ని ఇల్లరికం తెచ్చుకున్నాడు. అయితే అల్లుడు వెంకటి టీవీలో ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నాడు. ఈలోపు ఇంటికి వచ్చిన మామ బుజ్జయ్య సీరియల్ చూడాలంటూ రిమోట్ లాక్కొని ఛానల్ మార్చాడు.
రిమోట్ తీసుకోవడంతో వెంకటికి కోపం వచ్చింది. దీని కోసం ఇద్దరు వాగ్వాదానికి కూడా దిగారు. ఆగ్రహంతో ఊగిపోయిన బుజ్జయ్య పక్కనే ఉన్న కత్తెర తీసుకొని అల్లుడిపై దాడి చేశాడు. చెవి, మెడపై తీవ్ర గాయం కావడంతో... వెంకటి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు బాధితుడ్ని వెంటనే ఆస్పత్రి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. వెంకటి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితుడు బుజ్జయ్యను అదుపులోకి తీసుకున్నారు.
రిమోట్ తీసుకోవడంతో వెంకటికి కోపం వచ్చింది. దీని కోసం ఇద్దరు వాగ్వాదానికి కూడా దిగారు. ఆగ్రహంతో ఊగిపోయిన బుజ్జయ్య పక్కనే ఉన్న కత్తెర తీసుకొని అల్లుడిపై దాడి చేశాడు. చెవి, మెడపై తీవ్ర గాయం కావడంతో... వెంకటి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు బాధితుడ్ని వెంటనే ఆస్పత్రి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. వెంకటి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితుడు బుజ్జయ్యను అదుపులోకి తీసుకున్నారు.