యాప్నగరం

ఓటు తొలగించారని ఆవేదన.. సెల్‌టవర్‌ ఎక్కిన యువకుడు

ఓటర్ల జాబితా నుంచి తన పేరును తొలగించారంటూ టవర్ పైకి ఎక్కి ఆందోళనకు దిగిన యువకుడు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతడి ఓటును అన్యాయంగా తొలగించారని ఆవేదన.

Samayam Telugu 20 Feb 2019, 1:16 pm

ప్రధానాంశాలు:

  • టవర్‌పైకి ఎక్కి దూకేస్తానంటూ హంగామా
  • యువకుడికి సర్థిచెప్పిన పోలీసులు
  • సురక్షితంగా కిందకు దించిన పోలీసులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బుద్వేల్‌లో ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హంగామా చేశాడు. ఓటర్ల జాబితా నుంచి తన పేరును తొలగించారంటూ టవర్ పైకి ఎక్కి ఆందోళనకు దిగాడు. ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. అతడికి నచ్చజెప్పి కిందకు దించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
టవర్ పైకి ఎక్కిన యువకుడు కిస్మత్‌పూర్‌కు చెందిన శ్రవణ్‌గా గుర్తించారు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతడి ఓటును అన్యాయంగా తొలగించారని ఆరోపిస్తున్నాడు. అధికారుల్ని కలిసినా న్యాయం జరగలేదని.. ఆ ఆవేదనతోనే టవర్‌పైకి ఎక్కినట్లు స్థానికులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.