కొంచెంలో మిస్సయ్యాం.. చంద్రబాబుకు కేటీఆర్ అభినందనలు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అభినందనలు తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలుగు రాష్ట్రాలు సత్తా చాటిన సంగతి తెలిసిందే.
Samayam Telugu 10 Jul 2018, 9:58 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అభినందనలు తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలుగు రాష్ట్రాలు సత్తా చాటిన సంగతి తెలిసిందే. మంగళవారం ప్రకటించిన జాబితాలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలవగా.. తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. అయితే తొలి రెండు స్థానంలో ఉన్న ఏపీ, తెలంగాణ స్కోర్ల మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. ఈ విషయాన్నే కేటీఆర్ ప్రస్తావించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
‘ఈఓడీబీ ర్యాంకిగ్స్ 2018లో 0.09 శాతం స్వల్ప తేడాతో మేం మొదటి స్థానాన్ని మేం కోల్పోయాం. అయినప్పటికీ, ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తిదాయక నాయకత్వం, మంచి పనితనం మనల్ని ఈ ఏడాది కూడా మంచి స్థానంలో నిలబెట్టింది. అగ్రస్థానంలో నిలిచినందుకు చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్కు అభినందనలు’ అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
కాగా, ఈ జాబితాలో హర్యానా మూడో స్థానంలో.. జార్ఖండ్, గుజరాత్లు నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. ఏపీ 98.42 శాతం స్కోరుతో అగ్రస్థానంలో ఉండగా.. తెలంగాణ 98.33 శాతం స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రాష్ట్రాల ర్యాంకింగ్స్ను ప్రపంచ బ్యాంక్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ సంయుక్తంగా రూపొందిస్తాయి.
‘ఈఓడీబీ ర్యాంకిగ్స్ 2018లో 0.09 శాతం స్వల్ప తేడాతో మేం మొదటి స్థానాన్ని మేం కోల్పోయాం. అయినప్పటికీ, ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తిదాయక నాయకత్వం, మంచి పనితనం మనల్ని ఈ ఏడాది కూడా మంచి స్థానంలో నిలబెట్టింది. అగ్రస్థానంలో నిలిచినందుకు చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్కు అభినందనలు’ అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.