కొడంగల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. ఉప ఎన్నికల్లో గెలిచే సత్తా రేవంత్ రెడ్డికి లేదని అన్నారు. బుధవారం కొడంగల్కు చెందిన కొంతమంది టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఈ మేరకు టీఆర్ఎస్ భవన్లో వారందరికీ కేటీఆర్ సహా పలువురు మంత్రులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రేవవంత్ రెడ్డిపై.. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు.
‘గడిచిన ఐదు దశాబ్దాల్లో కోస్గిలో గానీ, మద్దూరులో గానీ, కొడంగల్లో గానీ.. ఒక 30 పడకల ఆసుపత్రి పెట్టలేదు. కానీ లక్ష్మారెడ్డి గారు వచ్చిన తరవాత ఈ మూడు ప్రాంతాల్లో 50 పడకల ఆసుపత్రిలు ఏర్పాటుచేశారు. ఆ భవనాలు కూడా ప్రారంభమై పూర్తికావస్తున్నాయి. ఇదేదో ఎన్నికల కోసం చేస్తున్న కార్యక్రమం కాదు. ఆ నాడు ఎన్నికలు వస్తాయని కూడా మనకు తెలీదు. గడిచిన 50 ఏళ్లలో చేయలేని పనిని ఈ మూడేళ్లలోనే చేసి చూపించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
గులాబీ దండయాత్ర ఈసారి కొడంగల్ నుంచే ప్రారంభమవుతున్న నమ్మకం తనకు కలిగిందని కేటీఆర్ అన్నారు. ‘పార్టీలు మారడం, నోరు పారేసుకోవడం, కేసీఆర్ ఇంట్లో ఉండే చిన్న పిల్లలతో సహా అందరినీ తిట్టడం, బ్లాక్ మెయిల్ చేయడం, చిప్పకూడు తినడం, దిక్కుమాలిన పనులు చేయడం, దానికి కేసీఆర్ను నిందించడం’ అంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. ‘నన్ను కేసీఆరే జైళ్లో పెట్టించాడు. మరి దొంగ పనులు చేస్తే ఏడబెడతరు నిన్ను. చేసింది దిక్కుమాలిన పని. సిగ్గుండాలి మాట్లాడనీకి. దిక్కుమాలిన పని చేసి ముఖం దాచుకోవడానికి ఎక్కడైనా దాక్కోవాలి కానీ పెద్ద పోటుగాడిలా మీసాలు తిప్పుకుంటా జైలులోకెళ్లి వస్తాడా బయటికి’ అంటూ రేవంత్పై నిప్పులు చెరిగారు.
‘గడిచిన ఐదు దశాబ్దాల్లో కోస్గిలో గానీ, మద్దూరులో గానీ, కొడంగల్లో గానీ.. ఒక 30 పడకల ఆసుపత్రి పెట్టలేదు. కానీ లక్ష్మారెడ్డి గారు వచ్చిన తరవాత ఈ మూడు ప్రాంతాల్లో 50 పడకల ఆసుపత్రిలు ఏర్పాటుచేశారు. ఆ భవనాలు కూడా ప్రారంభమై పూర్తికావస్తున్నాయి. ఇదేదో ఎన్నికల కోసం చేస్తున్న కార్యక్రమం కాదు. ఆ నాడు ఎన్నికలు వస్తాయని కూడా మనకు తెలీదు. గడిచిన 50 ఏళ్లలో చేయలేని పనిని ఈ మూడేళ్లలోనే చేసి చూపించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
గులాబీ దండయాత్ర ఈసారి కొడంగల్ నుంచే ప్రారంభమవుతున్న నమ్మకం తనకు కలిగిందని కేటీఆర్ అన్నారు. ‘పార్టీలు మారడం, నోరు పారేసుకోవడం, కేసీఆర్ ఇంట్లో ఉండే చిన్న పిల్లలతో సహా అందరినీ తిట్టడం, బ్లాక్ మెయిల్ చేయడం, చిప్పకూడు తినడం, దిక్కుమాలిన పనులు చేయడం, దానికి కేసీఆర్ను నిందించడం’ అంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. ‘నన్ను కేసీఆరే జైళ్లో పెట్టించాడు. మరి దొంగ పనులు చేస్తే ఏడబెడతరు నిన్ను. చేసింది దిక్కుమాలిన పని. సిగ్గుండాలి మాట్లాడనీకి. దిక్కుమాలిన పని చేసి ముఖం దాచుకోవడానికి ఎక్కడైనా దాక్కోవాలి కానీ పెద్ద పోటుగాడిలా మీసాలు తిప్పుకుంటా జైలులోకెళ్లి వస్తాడా బయటికి’ అంటూ రేవంత్పై నిప్పులు చెరిగారు.