యాప్నగరం

టీ-పీసీసీ చీఫ్ ఉత్తమ్ ట్వీట్.. స్పందించిన కేటీఆర్

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంత్రి కేటీఆర్.. ప్రజా సమస్యలపై చాలా త్వరగా స్పందిస్తుంటారు. అక్కడితో ఆగిపోరు.. ఆ సమస్యకు పరిష్కారం దొరికే వరకు ఫాలో అప్ చేస్తుంటారు.

Samayam Telugu 13 Jun 2018, 11:25 am
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంత్రి కేటీఆర్.. ప్రజా సమస్యలపై చాలా త్వరగా స్పందిస్తుంటారు. అక్కడితో ఆగిపోరు.. ఆ సమస్యకు పరిష్కారం దొరికే వరకు ఫాలో అప్ చేస్తుంటారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా మంత్రికి ఓ ట్వీట్ చేశారు. వెను వెంటనే స్పందించిన ఆయన.. సమస్యను పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ సమస్యను తన దృష్టికి తీసుకొచ్చిన ఉత్తమ్‌కు కూడా కేటీఆర్ థ్యాంక్స్ చెప్పి హుందాగా వ్యవహరించారు.
Samayam Telugu Ktr..


అసలు విషయంలోకి వస్తే.. కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లాలో ఓ పేద వృద్ధ దంపతులు పూరి గుడిసెలో జీవనం సాగిస్తున్నారు. ఓ పూట తిని, తినక అష్టకష్టాలు పడుతున్న వారికి అధికారులు కూడా షాక్ ఇచ్చారు. రూ.500 కట్టాలంటూ రసీదు పంపించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నేతలు.. సమస్యను ఉత్తమ్‌ దృష్టికి తీసుకొచ్చారు. వారి దయనీయ పరిస్థితిని చూసిన ఆయన.. వెంటనే మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. ఆ వృద్ధులు పడుతున్న కష్టాలను తీర్చి.. డబుల్ బెడ్‌రూమ్ ఇల్లును కూడా కేటాయించాలని కోరారు.

ఉత్తమ్ ట్వీట్‌పై కేటీఆర్ కూడా వెంటనే స్పందించారు. ఈ సమస్యను నా దృష్టికి తీసుకొచ్చినందుకు.. థ్యాంక్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డిగారు అన్నారు. జరిగిన తప్పును సరిదిద్ది.. వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లుతో పాటూ ఆసరా ఫించన్‌ కూడా ఇవ్వాలని కొమరం భీం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రజా సమస్యలపై వెను వెంటనే స్పందించిన మంత్రికి, ఉత్తమ్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.