కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ పరోక్షంగా విమర్శలు చేశారు. జైళ్లో చిప్పకూడు తిన్నవారు అవినీతి గురించి మాట్లాడితే స్పందించాల్సిన అవసరం తమకు లేదని మంత్రి స్పష్టం చేశారు. జనవరి 1 నుంచి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తోన్న సంగతి తెలిసిందే. నాటి నుంచి నాటి నుంచి అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కేసీఆర్ సర్కార్ కమీషన్ల కోసం ప్రయివేట్ వ్యక్తుల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ విషయమై చర్చకు రావాలంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తన ఆరోపణలు నిజం కావని తేలితే ముక్కు నేలకు రాయడానికి సిద్ధమని చెప్పారు.
రేవంత్ రెడ్డి విమర్శలపై కేటీఆర్ స్పందిస్తూ.. జైళ్లో చిప్పకూడు తిన్నవారి ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. విద్యుత్ కొనుగోలు అవకతవకలపై ఆధారాలు ఉంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని రేవంత్కు సలహా ఇచ్చారు. వ్యవసాయ రంగానికి విజయవంతంగా 24 గంటల కరెంట్ ఇస్తున్నామని, దీన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక పోతోందన్నారు. రాష్ట్రంలో ఎప్పటికీ అధికారంలోకి రాలేమన్న భయంతోనే కాంగ్రెస్ పార్టీ నేతలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
రేవంత్ రెడ్డి విమర్శలపై కేటీఆర్ స్పందిస్తూ.. జైళ్లో చిప్పకూడు తిన్నవారి ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. విద్యుత్ కొనుగోలు అవకతవకలపై ఆధారాలు ఉంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని రేవంత్కు సలహా ఇచ్చారు. వ్యవసాయ రంగానికి విజయవంతంగా 24 గంటల కరెంట్ ఇస్తున్నామని, దీన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక పోతోందన్నారు. రాష్ట్రంలో ఎప్పటికీ అధికారంలోకి రాలేమన్న భయంతోనే కాంగ్రెస్ పార్టీ నేతలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.