యాప్నగరం

ఇళ్లు కావాలని ఏ బస్తీవోలు అడగలే: కేటీఆర్

హైదరాబాద్‌ బస్తీల్లోని ప్రజలు ఇరుకిరుకు ఇళ్లల్లో జీవనం సాగిస్తున్నారని, కుటుంబమంతా 20 గజాలు కూడా లేని ఒకే గదిలో ఉండాల్సిన పరిస్థితి ఇక్కడ ఉందని తెలంగాణ మున్సిపాలిటీ శాఖ మంత్రి కె. తారకరామారావు ఆవేదన వ్యక్తం చేశారు.

TNN 22 Apr 2017, 1:15 pm
హైదరాబాద్‌ బస్తీల్లోని ప్రజలు ఇరుకిరుకు ఇళ్లల్లో జీవనం సాగిస్తున్నారని, కుటుంబమంతా 20 గజాలు కూడా లేని ఒకే గదిలో ఉండాల్సిన పరిస్థితి ఇక్కడ ఉందని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఏ బస్తీ ప్రజలు తమకు ఇల్లు కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అడగలేదన్నారు. తన తెలంగాణ పేద ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలగకూడదనే కారణంతో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి కేసీఆర్ పూనుకున్నారని కేటీఆర్ చెప్పారు.
Samayam Telugu telangana minister ktr lays foundation stone for double bedroom houses in hyderabad
ఇళ్లు కావాలని ఏ బస్తీవోలు అడగలే: కేటీఆర్


ఈ మేరకు బన్సీలాల్‌పేట డివిజన్‌లోని కవాడీగూడలో 168 డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి కేటీఆర్ శనివారం భూమిపూజ చేశారు. మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలసి భూమిపూజ చేసిన కేటీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏదేమైనా ఈ ఏడాది హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు కట్టిచూపిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. వీటిని మేము వీటిని కేవలం ఇళ్లలా చూడటం లేదని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా భావిస్తున్నామని చెప్పారు.

అనంతరం కవాడీగూడ బస్తీలోని ప్రజలతో కేటీఆర్ మాట్లాడారు. బస్తీ మొత్తం తిరుగుతూ వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. దారిలో ఓ జీహెచ్‌ఎంసీ కార్మికురాలు కనబడితే ఆమెతో ఆప్యాయంగా మాట్లాడారు. ఓ అవ్వ తనకు పింఛను రావడంలేదని చెప్తే.. పరిశీలిస్తానని, నీకు అర్హత ఉంటే కచ్చితంగా పింఛను ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.