యాప్నగరం

కేటీఆర్‌ను కంటతడి పెట్టించిన సాయిశ్రీ వీడియో

చిన్నారి సాయిశ్రీ ఉదంతం తెలుగు రాష్ట్రాల ప్రజలను కంటతడిపెట్టించింది.

TNN 16 May 2017, 9:28 am
చిన్నారి సాయిశ్రీ ఉదంతం తెలుగు రాష్ట్రాల ప్రజలను కంటతడిపెట్టించింది. ఓ పక్క క్యాన్సర్ తన శరీరాన్ని తినేస్తుంటే... నాన్న కాపాడు అంటూ తండ్రికి వాట్సాప్ వీడియో మెసేజ్ పెట్టింది సాయిశ్రీ. బతకాలని ఉంది డాడీ... చికిత్స చేయించమంటూ వేడుకుంది. ఈ వార్త చదివిన వారు, వీడియో చూసిన ప్రతివారు కళ్ల నీళ్లు పెట్టుకున్నారు కానీ... ఆ కసాయి తండ్రి కరగలేదు. కనీసం జాడ కూడా తెలియకుండా ఎక్కడో దాక్కున్నాడు. ఆ నీచుడిపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ వార్త తెలంగాణ మంత్రి కేటీఆర్ వరకు చేరింది. ఆయన పాప వీడియో, వార్త చదివి తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. కంటతడి పెట్టారు. ఆయనా ఇద్దరు బిడ్డలకి తండ్రే. అందుకే కరిగి కన్నీరయ్యారు. మానవ విలువలు పడిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ట్విట్టర్లో తన ఆవేదనను పంచుకున్నారు.
Samayam Telugu telangana minister ktr teary eyed on vijayawada sai sree death case
కేటీఆర్‌ను కంటతడి పెట్టించిన సాయిశ్రీ వీడియో


విజయవాడకు చెందిన సాయిశ్రీ (12) క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఆదివారం మధ్యాహ్నం కన్నుమూసింది. తల్లిని, తనని వదిలి కొడుకులను తీసుకుని వెళ్లిపోయిన తండ్రి శివ కుమార్ ను ఆమె చాలా రోజులుగా చికిత్స చేయించమంటూ వేడుకుంది. చనిపోవడానికి మూడు రోజుల ముందే వాట్సాప్ లో కాపాడమని వేడుకుంటూ వీడియో పంపింది. ఆ వీడియో తల్లి సుమశ్రీ బయటపెట్టింది.
Gut wrenching incident. Brought tears to my eyes minute I saw the news & video. Blot on Humanity & human relations RIP Angel 🙏🙏 https://t.co/FHwDPJx8NV — KTR (@KTRTRS) May 15, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.