యాప్నగరం

అదిగో పులి.. టీఆర్ఎస్ కీలక నేత కాలేజీలో ఐటీ దాడులు!

తెలంగాణలో మరోసారి ఐటీ దాడుల కలకలం చోటు చేసుకుంది. మై హోం రామేశ్వర రావు ఇల్లు, ఆఫీసులపై ఇటీవలే దాడులు జరగడంతో ఈ వార్త ఆసక్తి కలిగించింది.

Samayam Telugu 6 Jul 2019, 9:13 pm
బీజేపీ చీఫ్ అమిత్ షా తెలంగాణలో పర్యటించిన రోజే.. రాష్ట్రంలో మరో వార్త హల్ చల్ చేసింది. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి చెందిన కాలేజీలో ఐటీ అధికారులు దాడులు చేశారనేది ఆ వార్త సారాంశం. శనివారం ఉదయం నుంచి దుండిగల్‌లో ఉన్న ఆయన కాలేజీలో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారని వార్తలొచ్చాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడా ఈ విషయం బయటకు రాలేదు గానీ.. సోషల్ మీడియాలో మాత్రం బయటకొచ్చింది. ఇటీవలే టీవీ9 కొత్త యాజమాన్యం మై హోం రామేశ్వరావుకు నివాసం, ఆఫీసులపై దాడులు జరగడంతో.. మల్లారెడ్డి నివాసంపై దాడులు జరిగాయనే వార్త ప్రాధాన్యం సంతరించుకుంది.
Samayam Telugu Malla-Reddy


టీఆర్ఎస్‌కు చెందిన కీలక నేతల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయని, ఓ పార్టీకి అనుకూల వాతావరణం క్రియేట్ చేయడానికే ఇలా జరుగుతోందని ప్రచారం జరిగింది. రాష్ట్రంలో ఏం జరుగుతోందని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.

మల్లారెడ్డి కాలేజీలపై దాడుల వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైన నేపథ్యంలో.. మంత్రి స్పందించారు. తన ఆస్తులపై ఎలాంటి దాడులు జరగలేదని ఆయన వివరణ ఇచ్చారు. అన్నట్టూ ఆయన శనివారం నాడు రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్‌లో ఇసుక నిల్వ కేంద్రాన్ని ప్రారంభించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.