యాప్నగరం

రేవంత్ గురించి మాట్లాడనంటూనే విమర్శలు!

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు.

TNN 2 Nov 2017, 1:16 pm
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి గురించి ఏమీ మాట్లాడను అంటూనే ఆయనను విమర్శించారు. రేవంత్ రాజీనామా ఇంతవరకు స్పీకర్‌కు చేరనే లేదని ఆయన అన్నారు. కానీ, నేరుగా స్పీకర్‌కు రాజీనామా లేఖ ఇచ్చినట్టు రేవంత్ ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేసేదేమీ లేదని... సాక్షాత్తు రాహుల్ గాంధీ వచ్చి కూర్చున్నా, వారికి ఒరిగేది ఏమీ ఉండదని ఎద్దేవా చేశారు. రేవంత్ చేరికతో తెలంగాణ కాంగ్రెస్‌లో ఆట మొదలైందని, పదవుల కోసం ఆ పార్టీలో కొట్లాటలు జరుగుతాయని తలసాని వ్యాఖ్యానించారు.
Samayam Telugu telangana minister talasani srinivas yadav comments against revanth reddy
రేవంత్ గురించి మాట్లాడనంటూనే విమర్శలు!


అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ తలసాని ఈ వ్యాఖ్యలు చేశారు. సంఖ్యా బలం లేనప్పుడు అవిశ్వాసం మాట ఎందుకు అని మంత్రి ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని... 50 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. గతంలోనే టీడీఎల్పీ టీఆర్ఎస్‌లో విలీనమైందదని... ఈ నేపథ్యంలో, తన రాజీనామా లేఖ అప్రస్తుతమని అన్నారు. టీడీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత రేవంత్ తన అనుచరులతో సమావేశమైన సందర్భంలో కేసీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఓటుకు నోటు కేసులో జైలు నుంచి విడుదలైన రోజు ఆట మొదలైందని తాను వ్యాఖ్యలు చేశానని, అయితే నిజమైన ఆట ఇప్పుడు మొదలైందని రేవంత్ అన్న వ్యాఖ్యలపై తలసాని కౌంటర్ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్‌పై పోటీచేసి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి పదవిని చేపట్టిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.