యాప్నగరం

ఏపీ నేతలకు పోరాట స్ఫూర్తి లేదు: తెలంగాణ మంత్రి

ఏపీకి ప్రత్యేక హోదాపై తెలంగాణ మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలకు ఆసక్తికరంగా మారాయి. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన ఆయన ఏపీలో పరిణామాలపై స్పందించారట. ఏపీ నేతలకు అసలు పోరాట స్ఫూర్తి లేదన్నారట శ్రీనివాస్ యాదవ్.

Samayam Telugu 24 Mar 2018, 2:43 pm
ఏపీకి ప్రత్యేక హోదాపై తెలంగాణ మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలకు ఆసక్తికరంగా మారాయి. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన ఆయన ఏపీలో పరిణామాలపై స్పందించారట. ఏపీ నేతలకు అసలు పోరాట స్ఫూర్తి లేదన్నారట శ్రీనివాస్ యాదవ్. పార్టీలన్నీ ప్రజల్ని మోసం చేస్తున్నాయని... నేతలకు పోరాట స్ఫూర్తి లేదన్నారట. తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన సూచించారట. ఎంపీలంతా రాజీనామా చేస్తే కేంద్రం తీరులో మార్పు వస్తుందని... అప్పుడే దేశం దృష్టిని ఆకర్షించవచ్చని చెప్పారట.
Samayam Telugu Talasni


అలాగే దేశంలో ఎక్కడ సమస్యలు ఉన్నా కేసీఆర్‌ నాయకత్వం వహిస్తారని... ఏపీ ప్రజలు కూడా కోరుకుంటే ఆయన సిద్ధమేనని మంత్రి వ్యాఖ్యానించారట. ఏపీది న్యాయమైన కోరికని... తమ పార్టీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, కవిత చెప్పారని పేర్కొన్నారట. ఏపీ ప్రజలు ఆపరేషన్లు నమ్మేంత అమాయకంగా లేరని... ఇప్పటికైనా నేతలంతా ఏకతాటిపైకి రావాలన్నారు. అప్పుడే కేంద్రంపై ఒత్తి తేవచ్చన్నారు మంత్రి. మరోవైపు అవిశ్వాసంపై కూడా స్పందించారు. తీర్మానంతో చంద్రబాబు సాధించేది ఏమీ లేదన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.