తెలంగాణ టీడీపీ నేతలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు హైదరాబాద్లో భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే, ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తెలంగాణ నేతలతో సమావేశమైన సమయంలో చంద్రబాబు ఇంటి ముందు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాన్వాయ్ వచ్చి ఆగింది. దీంతో, అక్కడే ఉన్న మీడియా ఇదిచూసి ఆశ్చర్యపోయింది. వెంటనే తలసాని కాన్వాయ్ వద్దకు మీడియా వెళ్లడంతో, ఆయన వెనుదిరిగారు. అయితే, చంద్రబాబు నివాసం వైపు రావడంపై తలసానిని మీడియా ప్రశ్నించగా, ట్రాఫిక్ జామ్ కారణంగా రోడ్ నెం.36 వైపు వెళ్లే నిమిత్తం ఇటువైపు రావాల్సి వచ్చిందని, చంద్రబాబు ఇక్కడ ఉన్న విషయం తనకు తెలియదని సమాధానం ఇచ్చారు. అసలు, తలసాని పొరపాటున చంద్రబాబు నివాసం వైపు వచ్చారా? లేక బాబును కలిసేందుకే వచ్చారా? అనే విషయమై రాజకీయంగా చర్చ జరుగుతోంది.
మరోవైపు తెలంగాణలో పూర్వ వైభవాన్ని సంపాదించడమే లక్ష్యంగా తీసుకోవాల్సిన చర్యలు, క్షేత్రస్థాయిలో కార్యకర్తల్లో మనోస్థైర్యాన్ని నింపడం లాంటి అంశాలపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఈ ఉదయం సమావేశమయ్యారు. హైదరాబాద్ లో పలువురు నేతలతో సమావేశమైన ఆయన, టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని, ఏ నేతలు వలస వెళ్లినా నష్టం ఉండబోదని, కార్యకర్తల బలం క్షేత్రస్థాయిలో పార్టీకి ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ కోసం త్వరలోనే తెలంగాణలో పర్యటిస్తానని ఈ సందర్భంగా నేతలకు చంద్రబాబు వెల్లడించినట్లు సమాచారం. ఈ సమావేశానికి ఎల్ రమణ, రేవంత్ రెడ్డి, దేవేందర్ గౌడ్, ఆర్ కృష్ణయ్య తదితరులు హాజరయ్యారు.
మరోవైపు తెలంగాణలో పూర్వ వైభవాన్ని సంపాదించడమే లక్ష్యంగా తీసుకోవాల్సిన చర్యలు, క్షేత్రస్థాయిలో కార్యకర్తల్లో మనోస్థైర్యాన్ని నింపడం లాంటి అంశాలపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఈ ఉదయం సమావేశమయ్యారు. హైదరాబాద్ లో పలువురు నేతలతో సమావేశమైన ఆయన, టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని, ఏ నేతలు వలస వెళ్లినా నష్టం ఉండబోదని, కార్యకర్తల బలం క్షేత్రస్థాయిలో పార్టీకి ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ కోసం త్వరలోనే తెలంగాణలో పర్యటిస్తానని ఈ సందర్భంగా నేతలకు చంద్రబాబు వెల్లడించినట్లు సమాచారం. ఈ సమావేశానికి ఎల్ రమణ, రేవంత్ రెడ్డి, దేవేందర్ గౌడ్, ఆర్ కృష్ణయ్య తదితరులు హాజరయ్యారు.