యాప్నగరం

మెట్రో రైలులో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల ఫస్ట్ జర్నీ

హైదరాబాద్ నగర వాసులకి గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడు మెట్రో రైలులో ప్రయాణించాలా అని ఎదురుచూస్తున్న నగర వాసుల...

TNN 25 Nov 2017, 11:43 am
హైదరాబాద్ నగర వాసులకి గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడు మెట్రో రైలులో ప్రయాణించాలా అని ఎదురుచూస్తున్న నగర వాసుల సస్పెన్స్‌కి తెరపడే సమయం ఇంకెంతో దూరం లేదు. ఈ నెల 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర మంత్రులు, హైదరాబాద్ నగరానికి చెందిన వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు మెట్రో ట్రయల్ రన్ జర్నీలో ప్రయాణించారు. నాగోలు నుంచి మెట్టుగూడ వరకు జరిగిన ఈ మెట్రో రైలు ప్రయాణం అనంతరం ప్రజాప్రతినిధులు తిరిగి అదే రైలులో నాగోలుకి చేరుకున్నారు.
Samayam Telugu telangana ministers travels in metro trail run journey
మెట్రో రైలులో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల ఫస్ట్ జర్నీ


నాగోలులో మెట్రో స్టేషన్ వద్ద ప్రజాప్రతినిధులకి మెట్రో రైలు ప్రయాణం, టికెట్ల కొనుగోలు, నిర్వహణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు అక్కడే వున్న ఉన్నతాధికారులు. పనిలోపనిగా ప్రధాని ఈ మెట్రో రైలు ప్రారంభోత్సవానికి వస్తున్న నేపథ్యంలో మెట్రో రైలు స్టేషన్లలో సుందరీకరణ పనులని కూడా పరిశీలించారు మంత్రి కేటీఆర్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.