యాప్నగరం

బాలికపై సామూహిక అత్యాచారం

తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలలో ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

TNN 11 Feb 2018, 8:03 am
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలలో ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని గఢ్‌పూర్ పంచాయతీలోని ర్యాలీ గ్రామంలో గత గురువారం ఈ దారుణం చోటుచేసుకోగా.. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకి ఫిర్యాదు చేశారు.
Samayam Telugu telangana minor girl raped by three men
బాలికపై సామూహిక అత్యాచారం


పోలీసుల కథనం ప్రకారం.. ర్యాలీ గ్రామానికి చెందిన బాలిక తల్లిదండ్రులు వ్యవసాయ పనుల కోసం బయటికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉంది. దీంతో గత గురువారం అదే గ్రామానికి చెందిన రాయమల్లు అనే లారీ డ్రైవర్ బాలికకి మాయమాటలు చెప్పి భీమారం తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై లారీ డ్రైవర్లు మహేశ్, కుమార్‌లతో కలిసి రాయమల్లు అత్యాచారం చేశాడు. బాలిక ఇంటి దగ్గర కనబడకపోవడంతో వెతికిన తల్లిదండ్రులు.. గ్రామంలో ఆరా తీయగా రాయమల్లు తీసుకెళ్లినట్లు తేలడంతో వారు పోలీసులకి ఫిర్యాదు చేశారు. ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.