యాప్నగరం

నేటి నుంచి నేరగాళ్ల సమగ్ర సర్వే!

పోలీసు రికార్డుల్లో ఉన్న నేరగాళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారనే వివరాలను అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించనున్నారు.

Samayam Telugu 18 Jan 2018, 8:28 am
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి సకల నేరస్తుల సమగ్ర సర్వే చేపట్టనున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో గత పదేళ్లలో నేర చరిత్ర కలిగిన పాత నేరస్థుల నివాసాలకు వెళ్లి ప్రవర్తన, నడవడికపై సర్వే చేయనున్నట్లు తెలిపారు. హోంగార్డు నుంచి డీజీపీ వరకు ప్రతి ఒక్కరూ ఈ సర్వేలో పాల్గొని వివరాలు సేకరిస్తారన్నారు. పోలీసు రికార్డుల్లో ఉన్న నేరగాళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారనే వివరాలను అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించనున్నారు.
Samayam Telugu telangana police to enumerate geo tag criminals in massive survey
నేటి నుంచి నేరగాళ్ల సమగ్ర సర్వే!


పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ సర్వే చేపడతారు. నేరస్థుల పూర్తి వివరాలను బిగ్ డేటాబేస్‌లో పొందుపరుస్తారు. నేరగాళ్ల ఫొటోలు, వేలి ముద్రలు తీసుకోవడం తదితర విధానాలతో డేటా సేకరిస్తారు. ఈ వివరాలన్నీ క్రైం డేటా ఎనాలసిస్ యూనిట్ ద్వారా తెలంగాణ కాప్ యాప్‌కు అనుసంధానం చేస్తారు. ఏదైనా నేరం జరిగినప్పుడు పాత కేసుల్లో నిందితులను గుర్తించేందుకు ఈ డేటా ఉపయోగపడుతుంది. ముఖ్య నేరగాళ్ల ఇళ్లను జియో ట్యాగింగ్‌తో అనుసంధానం చేస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.