తెలంగాణ పౌల్ట్రీ రైతులు తమ సమస్యల గురించి మంత్రి నిరంజన్ రెడ్డి వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. గురువారం (ఏప్రిల్ 25) హైదరాబాద్లో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని కలిసి తాము ఎదుర్కొంటున్న వివిధ సమస్యల గురించి వివరించారు. వాటికి పరిష్కారం కోరుతూ వినతి పత్రం అందజేశారు.
అసాధారణంగా పెరుగుతున్న ఫీడ్ ఖర్చుతో ఫౌల్ట్రీల నిర్వహణ అంతకంతకూ భారమవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫీడ్ రేట్లకు సమాంతర గుడ్డు రేటు పెరగకపోవడంతో నష్టపోతున్నట్లు తెలిపారు. ఒక్కో గుడ్డుపై రూపాయి వరకూ నష్టపోతున్నట్లు చెప్పారు. ఈ లెక్కన తెలంగాణ రైతులు రోజుకు రూ.3 లక్షల పైగా నష్టపోతున్నారని తెలిపారు.
ప్రభుత్వ అధ్వర్యంలో ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని రైతులు మంత్రి నిరంజన్ రెడ్డిని కోరారు. ప్రభుత్వ అధికారులే గుడ్డు ధరలను నియంత్రించేలా చర్యలు చేపట్టాలని కోరారు. రైతుల సమస్యలను మంత్రి సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రైతులకు మేలు జరిగేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.
అసాధారణంగా పెరుగుతున్న ఫీడ్ ఖర్చుతో ఫౌల్ట్రీల నిర్వహణ అంతకంతకూ భారమవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫీడ్ రేట్లకు సమాంతర గుడ్డు రేటు పెరగకపోవడంతో నష్టపోతున్నట్లు తెలిపారు. ఒక్కో గుడ్డుపై రూపాయి వరకూ నష్టపోతున్నట్లు చెప్పారు. ఈ లెక్కన తెలంగాణ రైతులు రోజుకు రూ.3 లక్షల పైగా నష్టపోతున్నారని తెలిపారు.
ప్రభుత్వ అధ్వర్యంలో ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని రైతులు మంత్రి నిరంజన్ రెడ్డిని కోరారు. ప్రభుత్వ అధికారులే గుడ్డు ధరలను నియంత్రించేలా చర్యలు చేపట్టాలని కోరారు. రైతుల సమస్యలను మంత్రి సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రైతులకు మేలు జరిగేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.