యాప్నగరం

Vijayawada Bus Fire: గరుడ బస్సులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం

ప్రమాద సమయంలో బస్సులో 50మంది ప్రయాణికులు. మంటలు రావడాన్ని గమనించి ప్రయాణికుల్ని అప్రమత్తం చేసిన బస్సు డ్రైవర్. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. బస్సు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతోంది.

Samayam Telugu 21 Feb 2019, 12:54 pm

ప్రధానాంశాలు:

  • విజయవాడ సమీపంలోని జూపూడి దగ్గర ఘటన
  • షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగిందని నిర్థారణ
  • ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu bus..
విజయవాడ సమీపంలో తెలంగాణ ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తృటిలో తప్పింది. గురువారం విజయవాడ నుంచి హైదరాబాద్ బయల్దేరిన బస్సులో.. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి దగ్గర మంటలు చెలరేగాయి. మంటలు రావడాన్ని గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమై ప్రయాణికుల్ని కిందకు దించేశాడు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పేశారు.
ఎలక్ట్రికల్ వైరింగ్‌లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు నిర్థారించారు.. ప్రమాదంలో బస్సు వెనుకబాగం మొత్తం కాలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తమై వెంటనే వారిని దించేయడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికుల్ని మరో బస్సులో హైదరాబాద్‌కు పంపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.