యాప్నగరం

Madhusudhana Chary: స్పీకర్‌కు రూల్స్ వర్తించవా.. తెలంగాణ డీజీపీకి నెటిజన్ ఫిర్యాదు

సామాన్యుడికే రూల్సా.. పెద్దవాళ్లకు లేవా.. ఏం వాళ్లు తప్పు చేస్తే వదిలేస్తారా అంటున్నారు నెటిజన్లు. సెలబ్రిటీల నుంచి రాజకీయ నేతల వరకు ఎవరు తప్పు చేసినా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు.

Samayam Telugu 30 May 2018, 1:12 pm
సామాన్యుడికే రూల్సా.. పెద్దవాళ్లకు లేవా.. ఏం వాళ్లు తప్పు చేస్తే వదిలేస్తారా అంటున్నారు నెటిజన్లు. సెలబ్రిటీల నుంచి రాజకీయ నేతల వరకు ఎవరు తప్పు చేసినా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. మొన్నే రాంగ్ రూట్‌లో వెళ్తున్న పోలీస్ వెహికల్‌ను ఫోటో తీసి మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన చర్యలకు ఆదేశించారు. అయితే ఈసారి మాత్రం ఏకంగా తెలంగాణ స్పీకర్‌ మధుసూదనాచారిపైనే డీజీపీ ఫిర్యాదు చేశారు కొంతమంది నెటిజన్లు. ఇప్పుడీ ఫోటోలు, పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Samayam Telugu Speaker


ఏం లేదు.. భూపాలపల్లిలో బస్టాండ్ ప్రారంభత్స కార్యక్రమానికి స్పీకర్ హాజరయ్యారు. అంతకముందు భారీ బైక్ ర్యాలీ నిర్వహించగా.. స్పీకర్‌తో పాటూ ఎంపీ దయాకర్, టీఆర్ఎస్ నేతలు, పోలీసులు కూడా పాల్గొన్నారు. అయితే ర్యాలీకి వచ్చిన సమయంలో హెల్మెట్ లేకుండా బైక్ నడపారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఓ కాంగ్రెస్ నేతతో పాటూ.. ఓ నెటిజన్ డీజీపీతో పాటూ సీఎంవోకు ట్వీట్ చేశారు. నెటిజన్ అయితే మంత్రి కేటీఆర్ దృష్టికి కూడా విషయాన్ని తీసుకొచ్చాడు. అందులో 'తెలంగాణ డీజీపీ, తెలంగాణ సీఎంవోకు మన గౌరవనీయులైన స్పీకర్ మధుసూదనాచారిగారు, పోలీసు అధికారి హెల్మెట్ లేకుండా బైక్ నడిపారు. వారికి కూడా సామాన్యుడికి వేసినట్లు రూ.100 నుంచి రూ.500 వరకు ఫైన్ వేయాలని కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.