యాప్నగరం

Sravan Kumar Reddy: బోస్టన్ బీచ్‌లో తెలుగు విద్యార్థి గల్లంతు

స్నేహితులతో బీచ్‌కు వెళ్లిన శ్రావణ్.. అలల ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. శ్రావణ్ కోసం గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు.

Samayam Telugu 23 Apr 2019, 12:24 pm

ప్రధానాంశాలు:

  • శ్రావణ్‌కుమార్ రెడ్డి స్వస్థలం బెల్లంపల్లి
  • ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాడు
  • శ్రావణ్ సోదరుడికి సమాచారమిచ్చిన అధికారులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu adb.
అమెరికాలోని బోస్టన్ బీచ్‌లో తెలుగు విద్యార్థి గల్లంతయ్యాడు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన శ్రావణ్‌కుమార్ ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాడు. ఆదివారం ఈస్టర్ కావడంతో.. స్నేహితులతో కలిసి సమీపంలోని బీచ్‌కు వెళ్లాడు. సరదాగా సముద్రంలోకి వెళ్లి ఈత కొడుతుండగా.. అలలు ఉద్ధృతికి శ్రావణ్‌ సముద్రంలో కొట్టుకుపోయాడు.
శ్రావణ్ కొట్టుకుపోవడాన్ని గమనించిన స్నేహితులు.. కాపాడేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. అప్పటికే శ్రావణ్ గల్లంతయ్యాడు. వెంటనే అధికారులకు సమాచారం అందివ్వడంతో గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం బెల్లంపల్లిలో ఉంటున్న శ్రావణ్ సోదరుడికి సమాచారం అందజేశారు. ప్రస్తుతం శ్రావణ్ తల్లిదండ్రులు వరంగల్‌లో మరో కొడుకు వద్ద నివాసముంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.