యాప్నగరం

నేటి నుంచి సాగర్‌-శ్రీశైలం లాంచీ ప్రయాణం

నాగార్జునసాగర్‌ - శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణానికి రంగం సిద్ధమైంది. నిన్నటివరకూ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేసిన తెలంగాణ టూరిజం శాఖ.. నేటి నుంచి (నవంబర్ 1) పర్యాటకులకు లాంచీ ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. సాగర్‌ నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరే లాంచీ సాయంత్రం 4 గంటలకు శ్రీశైలం చేరుతుంది.

TNN 1 Nov 2017, 10:13 am
నాగార్జునసాగర్‌ - శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణానికి రంగం సిద్ధమైంది. నిన్నటివరకూ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేసిన తెలంగాణ టూరిజం శాఖ.. నేటి నుంచి (నవంబర్ 1) పర్యాటకులకు లాంచీ ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. సాగర్‌ నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరే లాంచీ సాయంత్రం 4 గంటలకు శ్రీశైలం చేరుతుందని లాంచీ యూనిట్‌ మేనేజర్‌ సత్యం తెలిపారు. అక్కడ పర్యాటకులకు బస కల్పించి, గురువారం ఉదయం దైవదర్శనం చేయిస్తారు. ఆ తర్వాత అక్కడి దర్శనీయ ప్రదేశాలు చూపించి, తిరిగి 10 గంటలకు బయలుదేరి సాయంత్రానికి లాంచీ సాగర్‌ చేరుకుంటుంది. కావాలనుకునేవారు రోడ్డు మార్గం ద్వారాను తిరిగి వెళ్లవచ్చు.
Samayam Telugu telangana tourism to start nagarjuna sagar srisailam boat journey from november 1
నేటి నుంచి సాగర్‌-శ్రీశైలం లాంచీ ప్రయాణం


హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు ఓ ప్యాకేజీ కింద రూ.3800గా నిర్ణయించారు. సాగర్‌ నుంచి శ్రీశైలం వరకు మాత్రమే వెళ్లే పర్యాటకులైతే.. పెద్దలకు రూ.1500, పిల్లలకు రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది.
లాంచీ ప్రయాణం ప్యాకేజీ వివరాలు..


Also Read: లాంచీలో కృష్ణమ్మ అందాల కనువిందు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.