యాప్నగరం

భర్త వేధింపులు భరించలేక.. పోలీసులను ఆశ్రయించిన సర్పంచ్

భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని.. అతడి నుంచి ప్రాణహాని ఉందని ఓ మహిళా సర్పంచ్ పోలీసులను ఆశ్రయించింది.

Samayam Telugu 26 Jun 2018, 9:38 am
భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని.. అతడి నుంచి ప్రాణహాని ఉందని ఓ మహిళా సర్పంచ్ పోలీసులను ఆశ్రయించింది. తెలుగు యువత నాయకుడైన యతేంద్ర రామకృష్ణపై అతడి భార్య, తేలప్రోలు సర్పంచ్ హరిణి కుమారి ఆరోపణలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గత మూడేళ్ల నుంచి ఇద్దరి మధ్య అనుబంధం సన్నగిల్లిందని, పిల్లలు తనను డాడీ అని కూడా పిలవరని హరిణి వాపోయింది. పెళ్లయిన నెల రోజుల నుంచే వేధింపులు మొదలయ్యాయని మీడియాతో గోడు వెల్లబోసుకుంది.
Samayam Telugu harini-kumari


విజయవాడలో హోటల్‌లో ఉంటూ తన భర్త ఇంటికి రావడం లేదని, ప్రత్యర్థుల నుంచి ప్రాణహని ఉందని చెబుతున్న ఆయన.. నేను మీ దగ్గరకు వస్తానంటే అడ్రస్ కూడా చెప్పడం లేదని తెలిపింది. ఇప్పటి వరకూ 40 నుంచి 50 సార్లు పెద్దలు మాట్లాడి సర్దుబాటు చేశారని చెప్పింది.

భర్త కొట్టడంతో గాయపడిన ఆమె సోషల్ మీడియాలో తన గోడును వెల్లబోసుకుంది. మూడేళ్ల నుంచి తాను పిల్లలతో ఒక బెడ్రూంలో ఉంటే.. ఆయన మరో బెడ్రూంలో ఉంటున్నాడని ఆమె వాపోయింది. తనను అత్త కొట్టేదని ఆమె చెప్పుకొచ్చింది. తొలిసారి పోలీసు స్టేషన్లో కేసు పెట్టాక కొద్ది రోజులు మారాడని, దీంతో కేసు విత్ డ్రా చేసుకున్నానని చెప్పిన హరిణి.. తర్వాత మళ్లీ వేధింపులు ప్రారంభించాడని తెలిపింది.

అధికార పార్టీకి చెందిన రామకృష్ణ భార్యను వేధించడం గన్నవరం పరిసర ప్రాంతాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భర్త కొట్టడంతోపాటు అత్త కూడా తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తెలుగు యువత నాయకుడైన రామకృష్ణపై అతడి భార్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో.. తెలుగుదేశం పార్టీ పెద్దలు ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.