కోస్టల్ బ్యాంకు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ మర్డర్ మిస్టరీ వీడింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి, రెండు రోజులుగా దర్యాప్తు చేపట్టారు. సెల్సిగ్నల్స్ ఆధారంగా ఎట్టకేలకు కేసు మిస్టరీని చేధించారు. జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి ప్రియుడు రాకేష్ రెడ్డి కిరాయి హంతకుల సహయంతో జయరామ్ను హతమార్చినట్లు పోలీసులు నిర్దారించారు. దీంతో రాకేశ్రెడ్డిని పోలీసులు ఆదివారం (ఫిబ్రవరి 3) అరెస్టు చేశారు. రాకేశ్రెడ్డిని అదుపులోకి తీసుకున్న నందిగామ పోలీసులు హైదరాబాద్ నుంచి నందిగామకు తరలించారు. డబ్బు కోసమే జయరామ్ను రాకేశ్ హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్లోనే హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. హత్య అనంతరం కారులో నందిగామ వైపు తీసుకెళ్లి ప్రమాదంలో మృతి చెందినట్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లుగా పేర్కొన్నారు. మరోవైపు.. ఈ హత్యలో జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి పాత్ర ఉందా లేదా అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రాకేశ్రెడ్డి నుంచి శిఖా చౌదరి రూ.4.5 కోట్లు అప్పు తీసుకుంది. వీరిద్దరి మధ్య రుణం విషయమై గత కొంతకాలంగా గొడవ జరుగుతూ వస్తోంది. ఈ సందర్భంలోనే మేనకోడలి డబ్బును తాను చెల్లిస్తానని చిగురుపాటి సెటిల్మెంట్ చేశాడని తెలుస్తోంది. డబ్బు తీసుకుంది శిఖా చౌదరి.. అప్పు తీర్చాల్సింది కూడా ఆమె. అలాంటప్పుడు శిఖా చౌదరిని వదిలిపెట్టి జయరామ్ను రాకేశ్ రెడ్డి ఎందుకు చంపాడన్నది పోలీసులకు అంతుచిక్కడంలేదు.
మరోవైపు నందిగామ పోలీస్ స్టేషన్లో ఉన్న శిఖా చౌదరిని కలవడానికి కబాలి చిత్ర నిర్మాత కేపీ చౌదరి ఎందుకొచ్చాడు. శిఖా చౌదరి తల్లి సుశీలను పీఎస్కు ఎందుకు పిలిపించారు.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఈ కేసులో ఉత్పన్నమవుతున్నాయి. శిఖాను ఈ కేసు నుంచి తప్పించడానికి తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. చిగురుపాటి జయరామ్కు సంబంధించిన ఆర్ధిక లావాదేవీలన్నీ శిఖా చౌదరి కనుసన్నల్లోనే ఉండటం ఇంకా ఆమె పోలీసుల అదుపులోనే ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది.
గతనెల 31న రాత్రి కృష్ణాజిల్లా నందిగామ సమీపంలో కారులో జయరామ్ మృతిచెందినట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. జయరాం మృతదేహాన్ని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. అమెరికా నుంచి జయరామ్ భార్య, కొడుకు, కూతురు హైదరాబాద్కు చేరుకోవడంతో.. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి జయరాం మృతదేహాన్ని తరలించనున్నారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జయరామ్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు నందిగామ పోలీస్ స్టేషన్లో ఉన్న శిఖా చౌదరిని కలవడానికి కబాలి చిత్ర నిర్మాత కేపీ చౌదరి ఎందుకొచ్చాడు. శిఖా చౌదరి తల్లి సుశీలను పీఎస్కు ఎందుకు పిలిపించారు.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఈ కేసులో ఉత్పన్నమవుతున్నాయి. శిఖాను ఈ కేసు నుంచి తప్పించడానికి తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. చిగురుపాటి జయరామ్కు సంబంధించిన ఆర్ధిక లావాదేవీలన్నీ శిఖా చౌదరి కనుసన్నల్లోనే ఉండటం ఇంకా ఆమె పోలీసుల అదుపులోనే ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది.
గతనెల 31న రాత్రి కృష్ణాజిల్లా నందిగామ సమీపంలో కారులో జయరామ్ మృతిచెందినట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. జయరాం మృతదేహాన్ని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. అమెరికా నుంచి జయరామ్ భార్య, కొడుకు, కూతురు హైదరాబాద్కు చేరుకోవడంతో.. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి జయరాం మృతదేహాన్ని తరలించనున్నారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జయరామ్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.