యాప్నగరం

ఢిల్లీలో బిజీబిజీగా తెలుగు రాష్ట్రాల సీఎంలు..

భారత 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ తర్వాత..

TNN 25 Jul 2017, 7:19 pm
భారత 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రులతో వరస భేటీలతో బిజీబిజీగా ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నవిధంగా అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలని హోంమంత్రిని కేసీఆర్ కోరినట్లు సమాచారం. అనంతరం ఆయన ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ, జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కలవనున్నారు.
Samayam Telugu telugu cms chandrababu naidu and kcr delhi tour
ఢిల్లీలో బిజీబిజీగా తెలుగు రాష్ట్రాల సీఎంలు..


ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమయ్యారు. రాష్ట్ర రెవెన్యూ లోటు, పోలవరం ప్రాజెక్టుకు నిధుల మంజూరు తదితర అంశాలపై ఆయనతో చర్చించారు. రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని వెంటనే అమల్లోకి తీసుకు రావాలని కోరినట్టు తెలుస్తోంది. చంద్రబాబు వెంట పలువురు ఎంపీలు ఉన్నారు.

అంతకుముందు చంద్రబాబు.. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌, హర్షవర్దన్‌తోనూ సమావేశమయ్యారు. రాష్ట్రంలో కేంద్రీయ, గిరిజన విశ్వవిద్యాలయాల ఏర్పాటు గురించి వీరితో చర్చించారు. అమరావతి, పోలవరం నిర్మాణాలకు పర్యావరణ అనుమతులు తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. అనంతరం చంద్రబాబు బృందం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌తో భేటీ అయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.