యాప్నగరం

మారిషస్‌లో తెలుగు విద్యార్థి మృతి

మారిషస్‌లో తెలుగు విద్యార్థి చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. స్నేహితులతో కలిసి జలపాతాన్నిచూసేందుకు వెళ్లి... ప్రమాదవశాత్తూ నీళ్లలో మునిగి చనిపోయాడు.

Samayam Telugu 16 Apr 2018, 7:25 pm
మారిషస్‌లో తెలుగు విద్యార్థి చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం అన్నంగికి చెందిన పమిడి సాయి మనోజ్ మారిషస్‌లో ఎంబీబీఎస్ ఫస్టియర్ చదువుతున్నాడు. అయితే నిన్న ఆదివారం కావడంతో స్నేహితులతో కలిసి జలపాతాన్నిచూసేందుకు వెళ్లారు. ఈత కొట్టేందుకు నీళ్లలోకి దిగిన మనోజ్... లోతు ఎక్కువ ఉండటంతో మునిగిపోయాడు. వెంటనే అతడ్ని కాపాడి ఆస్పత్రికి తీసుకెళ్లగా... చికిత్స పొందుతూ చనిపోయినట్లు స్నేహితులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
Samayam Telugu Student Dead


వెంకటస్వామి, రమాదేవిలకు మనోజ్ ఒక్కడే సంతానం. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో... తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మనోజ్ డెడ్ బాడీని సొంత ఊరికి తరలించేందుకు సహకరించాలని మృతుడి తండ్రి అధికారులకు విజ్ఞ‌ప్తి చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.