యాప్నగరం

బ్యాంకాక్‌లో కృష్ణా జిల్లా యువకుడి మృతి

బ్యాంకాక్‌లో ఏపీ యువకుడు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన పల్లంపాటి వెంకటేష్ బ్యాంకాక్‌లో ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో మునిగిపోయాడు. అతడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్సపొందుతూ ప్రాణాలు విడిచాడు.

Samayam Telugu 14 Aug 2018, 10:35 am
బ్యాంకాక్‌లో ఏపీ యువకుడు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన పల్లంపాటి వెంకటేష్ బ్యాంకాక్‌లో ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో మునిగిపోయాడు. అతడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్సపొందుతూ ప్రాణాలు విడిచాడు. వెంకటేష్ హైదరాబాద్‌లో దివాన్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లో పని చేస్తున్నట్లు బంధువులు చెబుతున్నారు. ఆఫీసు పని మీద అతడు బ్యాంకాక్ వెళ్లినట్లు తెలుస్తోంది. కొడుకు మరణవార్త విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Samayam Telugu Bangkok


వెంకటేష్ మృతిపై కుటుంబ సభ్యులు అధికారులకు సమాచారం ఇచ్చారు. అతడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా సొంత ఊరికి తరలించేందుకు సహకరించాలని విజ్ఞ‌ప్తి చేశారు. అధికారులు కూడా ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. బ్యాంకాక్‌లో ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.