యాప్నగరం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వడగాలులు

సెంట్రల్ ఇండియాలో కొనసాగుతున్న ఉష్ణగాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు

Samayam Telugu 10 Apr 2017, 3:04 pm
సెంట్రల్ ఇండియాలో కొనసాగుతున్న ఉష్ణగాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. వేడి గాలులు దడ పుట్టిస్తున్నాయి. ఉక్కపోత ఊపిరి సలపనీయడం లేదు. రెండు రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు చేరుకున్నాయి. మధ్యప్రదేశ్‌, మరాట్వాడ, తెలంగాణ, కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలు, రాయలసీమలో తీవ్రస్థాయి ఉష్ణగాలుల ప్రభావం కొనసాగుతోందని వాతావరణ విభాగం తెలిపింది.
Samayam Telugu temperature raising in andhra pradesh telangana
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వడగాలులు


మరో రెండు, మూడు రోజుల పాటు వడగాల్పుల ప్రభావం ఇదేవిధంగా కొనసాగే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో సగటు ఉష్ణోగ్రతలు 3-5 డిగ్రీల మేర పెరిగాయి.

రామగుండం, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌లో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా భద్రాచలం, మహబూబ్‌నగర్‌లో 41, హన్మకొండ, హైదరాబాద్‌, ఖమ్మం, నల్గొండలో 40, హకీంపేటలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది.

కడప, కర్నూలులలో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా. అనంతపురం జిల్లాలో 42, నంద్యాల, తిరుపతిలో 41 డిగ్రీలు, జంగమహేశ్వరరంలో 40 డిగ్రీలు, నందిగామలో 39, విశాఖపట్నం, తుని, కావలి, కాకినాడలో 36, మచిలీపట్నం, ఒంగోలులో 35, నర్సాపురం, కళింగపట్నంలో 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.


ఆధారం: ఈనాడు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.