యాప్నగరం

‘ఫణి’ ప్రభావంతో తెలంగాణలో వర్షాలు.. తగ్గనున్న ఎండలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుఫాను బుధవారానికి అత్యంత తీవ్రమైన తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే.

Samayam Telugu 30 Apr 2019, 11:18 am
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుఫాను బుధవారానికి అత్యంత తీవ్రమైన తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. మరోవైపు, తెలంగాణలో ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో నమోదవుతుండటంతో నిప్పుల కొలిమిని తలపిస్తోంది. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే జంకుతున్నారు. అయితే, తుఫాను ప్రభావంతో తెలంగాణలో మంగళవారం నుంచి అక్కడక్కడా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవి మూడు రోజుల పాటు కొనసాగుతాయని పేర్కొంది. ఫణి తుఫాను మంగళవారం ఉదయానికి మచిలీపట్నానికి 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, అది నెమ్మదిగా కదులుతూ క్రమంగా మే 4న నాటికి ఒడిశా తీరానికి చేరువగా వస్తుందని తెలిపారు.
Samayam Telugu fani


దీని గమనంపై మరో రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని, ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయని అన్నారు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలియజేసింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో సోమవారం 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం ఒక్క రోజే వడగాల్పులకు నలుగురు మృతిచెందారు. అత్యధికంగా ఆదిలాబాద్‌లో 45.3, నిజామాబాద్‌ 45, మెదక్‌ 43.6, హైదరాబాద్‌లో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రతలున్నాయి. వేడి తీవ్రతకు గాలిలో తేమ తగ్గడం ల్ల ఉక్కపోత పెరిగి, జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.