యాప్నగరం

మహాశివరాత్రి... జనసంద్రమైన శైవక్షేత్రాలు

మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్ని భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి.

TNN 7 Mar 2016, 8:40 am
మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్ని భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. ఆ పరమేశ్వరుడిని పూజించేందుకు తెల్లవారునుంచే భక్తులు బారులు తీరారు. శివనామాలతో తెలుగు రాష్ట్రాల లోగిళ్లు పునీతమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శైవక్షేత్రాలు... శ్రీశైలం, శ్రీకాళహస్తి. శ్రీశైలంలో మల్లికార్జునుడిగా వెలసి స్వామి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. సర్వదర్శనానికి 8గంటల సమయం పడుతోంది. ఏపీ మంత్రులు శిద్దా రాఘవరావు, అచ్చెన్నాయుడు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. ఇక శ్రీకాళహస్తిలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. అర్థరాత్రి 2గంటల నుంచే స్వామివారి దర్శానం మొదలైంది. క్యూలైన్లలోనే ప్రసాదం, పాలు పంపిణీ చేస్తున్నారు. శ్రీకాళహస్తికి నెల్లూరు, తిరుపతి, చెన్నై నుంచి కూడా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఇక పంచారామ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలో కూడా జనం కిటకిటలాడుతున్నారు.
Samayam Telugu temples decked up for mahasivaratri
మహాశివరాత్రి... జనసంద్రమైన శైవక్షేత్రాలు


ఇక తెలంగాణ విషయానికి వస్తే ప్రముఖ శైవక్షేత్రం కరీంనగర్‌లోని వేములవాడ. రాజన్న వెలసిన స్వామిని దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు పోటెత్తారు. దీంతో ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారు. టి.ప్రభుత్వం తరుఫున ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే మెదక్ లోని ఏడుపాయలలో కూడా భక్తులు సందడి చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.