యాప్నగరం

చినబాబుకు అమాత్య యోగం.. ఆ మంత్రుల్లో టెన్షన్!

ఏపీ మంత్రివర్గ విస్తరణలో సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్‌కు మంత్రి పదవి ఖాయం కానుంది.

TNN 5 Feb 2017, 4:10 pm
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేశ్‌కు మంత్రి పదవి ఖాయం కానుంది. అయితే ఆయనకు ఏ శాఖను కేటాయిస్తారనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చినబాబు రాకతో తమ పదవులకు ఎక్కడ కత్తెర పడుతుందో అని కొందరు మంత్రులు దిగాలు పడుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం కుమారుడైన కేటీఆర్ సమర్థవంతంగా ఐటీ శాఖను నిర్వహిస్తుండటంతో.. లోకేశ్‌కు కూడా ఏపీలో ఈ శాఖను కట్టబెట్టవచ్చనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. చంద్రబాబుకు మొదటి నుంచి ఐటీ అంటే మక్కువ కాబట్టి.. ఆ శాఖ చినబాబు ఖాతాలోకి వెళ్లడం ఖాయమని కొందరు ఘంటాపథంగా చెబుతున్నారు. అదే జరిగితే పల్లె రఘునాథ రెడ్డి వద్దనున్న శాఖల్లో నుంచి ఐటీ శాఖ చేజారినట్లే.
Samayam Telugu tension in ap ministers because of cabinet expansion
చినబాబుకు అమాత్య యోగం.. ఆ మంత్రుల్లో టెన్షన్!


లోకేశ్ బాబుకు ఒకటి కంటే ఎక్కువ పోర్ట్‌పోలియోలు కేటాయించే అవకాశాలే ఎక్కువగా ఉండటంతో.. మిగతా మంత్రుల్లోనూ భయం కనిపిస్తోంది. కొందరు మంత్రుల పనితీరు, వ్యవహార శైలి పట్ల సీఎం చంద్రబాబు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. పీతల సుజాత, రావెళ్ల కిషోర్ బాబు లాంటి కొందరు మంత్రులకు పదవీ గండం ఉన్నట్లు వదంతులు వ్యాపిస్తున్నాయి. ఈ విషయంలో ఎలా స్పందించాలో అర్థంకాని మంత్రులు పైకి మాత్రం అంతా చంద్రబాబు ఇష్టం అంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.