పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలులో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. నగర సమీపంలోని దిన్నెదేవరపాడు గ్రామ పరిధిలోని కట్టమంచి ప్రైవేట్ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. కర్నూలులోని చాణిక్యపురి కాలనీలో నివాసం ఉంటున్న రాజునాయక్, పార్వతీ బాయి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కూతురు ప్రీతి (16) గత మూడేళ్లుగా కట్టమంచిలోని ప్రైవేట్ పాఠశాలలో చదువుతోంది. శనివారం (ఆగస్టు 19) ఉదయం స్కూల్ హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరేసుకుంది. తోటి విద్యార్థులు గమనించి యాజమాన్యానికి తెలపడంతో ఆమెను హుటాహుటిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆ బాలిక మృతి చెందినట్టు తెలిపారు.
స్కూల్ యాజమాన్యం ఒత్తిడి భరించలేకే ప్రీతి ఆత్మహత్య చేసుకుందని విద్యార్థి సంఘాల నాయకులు, బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆ ప్రైవేట్ విద్యా సంస్థల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆసుపత్రి వద్దకు రాగా బాలిక బంధువులు కోపోద్రేకంతో ఆయనపై దాడి చేశారు. ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు.
ఆ తర్వాత ప్రీతి మృతదేహంతో కలెక్టరేట్ వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమకు న్యాయం చేయాలని, స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వాళ్లు డిమాండ్ చేశారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చిన సీఎం చంద్రబాబు కర్నూలులోనే ఉన్నారు.
స్కూల్ యాజమాన్యం ఒత్తిడి భరించలేకే ప్రీతి ఆత్మహత్య చేసుకుందని విద్యార్థి సంఘాల నాయకులు, బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆ ప్రైవేట్ విద్యా సంస్థల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆసుపత్రి వద్దకు రాగా బాలిక బంధువులు కోపోద్రేకంతో ఆయనపై దాడి చేశారు. ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు.
ఆ తర్వాత ప్రీతి మృతదేహంతో కలెక్టరేట్ వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమకు న్యాయం చేయాలని, స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వాళ్లు డిమాండ్ చేశారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చిన సీఎం చంద్రబాబు కర్నూలులోనే ఉన్నారు.