తెలంగాణా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు పరీక్ష ఉంటుంది. దాదాపు 5,56,757 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవ్వబోతున్నారు. 3,028 పరీక్ష కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. పదోతరగతి పరీక్షా కేంద్రాల వద్ద ముందస్తుగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు తెలిపారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, విద్యార్థులు ముందుగానే పరీక్షలకు చేరుకోవాలని, ఆందోళనగా చివరి నిమిషంలో రావద్దని సూచించారు.
తెలంగాణాలో నేటి నుంచి పదోతరగతి పరీక్షలు
తెలంగాణా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి.
TNN 21 Mar 2016, 7:32 am