యాప్నగరం

ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడి.. కశ్మీర్‌లో అలజడి

జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. గ్రెనేడ్ల దాడులతో విరుచుకుపడ్డారు. సోపియాన్ జిల్లాలో జరిపిన గ్రెనేడ్ దాడిలో 16 మంది గాయపడ్డారు.

TNN 4 Jun 2018, 2:08 pm
జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. గ్రెనేడ్ల దాడులతో విరుచుకుపడ్డారు. సోపియాన్ జిల్లాలో జరిపిన గ్రెనేడ్ దాడిలో 16 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురు జవాన్లతో పాటు 12 మంది పౌరులు ఉన్నారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఉగ్రవాదులు గురిచేసిన లక్ష్యానికి కాస్త దూరంగా.. రహదారి పక్కగా గ్రెనేడ్ పడటంతో భారీ ప్రాణనష్టం తప్పింది. సోపియాన్ జిల్లాలోని బాటపొరా చౌక్ వద్ద సోమవారం (జూన్ 4) ఉదయం ఈ ఘటన జరిగింది.
Samayam Telugu shopina


కశ్మీర్ పోలీసులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదలు ఈ దాడికి తెగబడ్డారు. రంజాన్ మాసం నేపథ్యంలో శాంతియుతంగా ఉండాలని పోలీసులు ప్రయత్నిస్తుండగా.. దీన్ని అదనుగా భావించిన ఉగ్రవాదులు గత వారం రోజులుగా పోలీసులు, రాజకీయ నేతలపై వరస దాడులకు పాల్పడుతున్నారు. దీంతో కశ్మీర్ లోయలో భయందోళనలు నెలకొన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.