యాప్నగరం

త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డ ఏపీ డిప్యూటీ సీఎం!

ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. మంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి జిల్లాకు వస్తున్న ఆమెకు వైసీపీ నేతలు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేపట్టారు.

Samayam Telugu 15 Jun 2019, 12:07 pm
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. మంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి జిల్లాకు వస్తున్న ఆమెకు వైసీపీ నేతలు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఈ క్రమంలో విజయనగరం జిల్లా భోగాపురం మండల కేంద్రంలో మంత్రికి అభినందన సభను వైసీపీ నేతలు శనివారం ఏర్పాటుచేశారు. ఈ సమయంలో వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే, ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణికి పెద్ద ప్రమాదం తప్పింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కురుపాం నియోజకవర్గం నుంచి రెండోసారి వైసీపీ నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించి, జగన్ క్యాబినెట్‌లో పుష్పశ్రీవాణి చోటు దక్కించుకున్నారు. డిప్యూటీ సీఎం హోదా సాధించిన పుష్పశ్రీవాణికి భోగాపురం నేతలు రాజాపులోవ జంక్షన్‌లో శనివారం అభినందన సభ ఏర్పాటు చేశారు.
Samayam Telugu 15brk-minister


ఈ సభకు హాజరైన మంత్రి వేదికపైకి వస్తుండగా అదే సమయంలో ఒక్కసారిగా పలువురు వైసీపీ నేతలు, అభిమానులు కూడా చేరుకున్నారు. దీంతో వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై వేదిక మీద నుంచి ఆమెను బయటకు తీసుకొచ్చారు. అలాగే వేదికపై ఉన్న మిగతావారిని కూడా తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అంతా క్షేమంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ పరిణామంతో మంత్రి పుష్పశ్రీవాణి అక్కడ నుంచి తిరిగి విజయనగరం పయనమయ్యారు. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల వైసీపీ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు, మంత్రి భర్త సైతం పాల్గొన్నారు. వారు కూడా త్రుటిలో తప్పించుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.