యాప్నగరం

ఎంపీ బాల్క సుమన్ ఇంట్లో చోరీ..

టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఇంట్లో చోరీ జరిగింది. సుమన్ ఇంట్లో నుంచి దొంగలు లక్ష రూపాయల నగదును అపహరించుకుపోయినట్లు తెలుస్తోంది. మంచిర్యాలలోని గౌతమ్‌నగర్‌లో ఎంపీ సుమన్ నివాసం ఉంది.

Samayam Telugu 7 Apr 2018, 4:45 pm
టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఇంట్లో చోరీ జరిగింది. సుమన్ ఇంట్లో నుంచి దొంగలు లక్ష రూపాయల నగదును అపహరించుకుపోయినట్లు తెలుస్తోంది. మంచిర్యాలలోని గౌతమ్‌నగర్‌లో ఎంపీ సుమన్ నివాసం ఉంది. శుక్రవారం (ఏప్రిల్ 6) రాత్రి ఎంపీ సుమన్ ఇంటితో పాటు మరో రెండు ఇళ్లల్లో చోరీ జరిగినట్లు సమాచారం. ఘటన జరిగిన సమయంలో ఎంపీ ఇంట్లో ఎవరూ లేరు. చోరీ జరిగిన మిగతా ఇళ్లలోనూ యజమానులు అందుబాటులో లేకపోవడంతో ఎంత మొత్తంలో చోరీ జరిగిందనేది ప్రస్తుతానికి తెలియరావడం లేదు.
Samayam Telugu Suman


గౌతమ్ నగర్ ప్రాంతంలో ఇటీవల దొంగల బెడద ఎక్కువైనట్లు స్థానికులు తెలిపారు. రెండు నెలల వ్యవధిలోనే ఇదే ప్రాంతంలో రెండో సారి దొంగతనం జరగినట్లు వారు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.