యాప్నగరం

అక్షరాస్యత 100% లేదు, ప్రజలకు అర్థం కాదు

తెలంగాణలో ప్రజలు నూటికి నూరుశాతం అక్షరాస్యత సాధించలేరని, అలాంటప్పుడు ఆంగ్లభాషతో సంబంధమున్న

Samayam Telugu 17 Dec 2016, 12:51 pm
తెలంగాణలో ప్రజలు నూటికి నూరుశాతం అక్షరాస్యత సాధించలేరని, అలాంటప్పుడు ఆంగ్లభాషతో సంబంధమున్న డిజిటల్ చెల్లింపులు ఎలా చేస్తారని తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ప్రశ్నించారు. శనివారం మండలిలో పెద్దనోట్లరద్దుపై చర్చ జరిగింది. ఈ చర్చలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
Samayam Telugu there is no 100 percent literacy how can people understand digital payments asks shabbir ali
అక్షరాస్యత 100% లేదు, ప్రజలకు అర్థం కాదు


2011 జనాభా లెక్కల ప్రకారం..తెలంగాణలో 66.46శాతం అక్షరాస్యత ఉందని..గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ పేమెంట్లతో ప్రజలు ఇబ్బందులు పడతారని షబ్బీర్ అలీ అన్నారు. స్వైపింగ్ మిషన్లతో కొనుగోళ్లు జరిపినప్పుడు వినియోగదారులకు ఇంగ్లిష్ లో సందేశాలు వస్తాయని అవి చాలా మందికి అర్థంకావని ఆయన గుర్తు చేశారు. నోట్లరద్దుతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని.. ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం ఫెయిలయ్యిందని షబ్బీర్ అన్నారు. అయితే సభలో లేని కేంద్రం గురించి ప్రస్తావించడం భావ్యం కాదని, ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించాలని కేసీఆర్ స్పీకర్ ను కోరారు.

రైతులు, కూలీలు, చివరికి శుభకార్యాలు జరిగే ఇళ్లల్లో కూడా నగదు లభ్యం కాక ఇబ్బందులు పడుతున్నారని...షబ్బీర్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలో ఆర్థిక వ్యవస్థ మారాలంటే క్యాష్ లెస్ సోసైటీగా మారాల్సిన అవసరం ఉందని బీజేపీ ఎమ్మెల్సీ రామ్ చందర్ రావు అన్నారు. ప్రతిఒక్కరి చేతుల్లోకి సెల్ ఫోన్లు ఉన్న ఈ కాలంలో డిజిటల్ చెల్లింపులు అసాధ్యం కాదనేది ఉత్పన్నమయ్యేలా ప్రశ్నే లేదని ఆయన అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.