యాప్నగరం

Visakha Utsav: ఆకట్టుకునే ప్రదర్శనలు.. అంబరాన్ని తాకిన సంబరాలు

విశాఖ ఉత్సవ్ వేడుకలు పర్యాటకులను అలరిస్తోన్న.. విశాఖపట్నం సంస్కృతిని, సంప్రదాయాలను చాటేలా నిర్వహిస్తోన్న ఈ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.

Samayam Telugu 29 Dec 2018, 5:21 pm
ఏపీ ప్రభుత్వం ఏటా మూడు రోజులపాటు నిర్వహిస్తోన్న విశాఖ ఉత్సవ్ సంబరాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు నాయుడు ఈ వేడుకలను ప్రారంభించారు. పర్యాటక శాఖ ఈ ఉత్సవాల కోసం భారీ ఏర్పాట్లు చేసింది. బీచ్‌ రోడ్డులోని రెండు ప్రధాన వేదికల్లో నిర్వహిస్తోన్న సంగీత, సాంస్కృతిక, జానపద కళారూపాల ప్రదర్శన ఆకట్టుకుంటోంది.
Samayam Telugu visakha utsav

శుక్రవారం నిర్వహించిన ఆరంభ వేడుకల్లో పాఠశాల విద్యార్థులు, నేవీ క్యాడెట్ల కార్నివాల్ ప్రొసెషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాయంత్రం పూట నేవల్ బ్యాండ్ ప్రదర్శనను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. గ్రామీ అవార్డ్ విన్నర్ రికీ కేజ్ గ్రూప్‌, థాయ్‌క్కుడమ్ బ్రిడ్జి విశాఖ ఉత్సవ్‌లో బ్యాండ్ పెర్ఫార్మెన్స్ నిర్వహించాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ కోర్టులు, ఆలయాల నమూనాలతో బీచ్ రోడ్డు పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.