యాప్నగరం

జాతీయగీతం.. నిలబడని కాశ్మీర్ స్టూడెంట్స్ అరెస్టు

హైదరాబాద్‌లోని ఓ సినిమా థియేటర్‌లో జాతీయగీతం వస్తుండగా లేచి నిలబడని ముగ్గురు స్టూడెంట్స్‌ని సైబరాబాద్ పోలీసులు

TNN 20 Aug 2017, 7:59 pm
హైదరాబాద్‌లోని ఓ సినిమా థియేటర్‌లో జాతీయగీతం వస్తుండగా లేచి నిలబడని ముగ్గురు స్టూడెంట్స్‌ని సైబరాబాద్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. విచారణ సమయంలో ఈ ముగ్గురూ కాశ్మీర్‌కి చెందిన విద్యార్థులుగా గుర్తించారు. దేశంలోని థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు తప్పనిసరిగా జాతీయ గీతాన్ని ప్రదర్శించాలని గత ఏడాది నవంబరులో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే.
Samayam Telugu three kashmir students arrested for not paying respect to national anthem played in theatre
జాతీయగీతం.. నిలబడని కాశ్మీర్ స్టూడెంట్స్ అరెస్టు


జాతీయ గీతం ప్రసారమవుతున్న సమయంలో.. తెరపై జాతీయ జెండాని మాత్రమే ప్రదర్శించాలని.. ప్రేక్షకులు అందరూ విధిగా లేచి నిలబడాలని సర్వోన్నత న్యాయస్థానం అప్పట్లో మార్గదర్శకాలు జారీ చేసింది. ఇటీవల ఇలానే థియేటర్‌లో నిలబడకుండా జాతీయగీతాన్ని అవమానించిన ఇద్దరు యువకుల్ని కూడా నగర పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అందులో ఒకరు ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారతీయుడిగా గుర్తించిన పోలీసులు నూతన చట్టంపై అవగాహన కల్పించి వదిలిపెట్టారు. మరొకరు.. కాలికి దెబ్బ తగలడంతో నిలబడలేకపోయానని అప్పట్లో వివరణ ఇచ్చుకున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.