యాప్నగరం

బెజవాడ: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి

వేలంగి మాత గుడికి వచ్చిన ముగ్గురు ప్రాణాలు ఎందుకు తీసుకున్నట్లు. ఆత్మహత్య చేసకున్నారా.. ఎవరైనా చంపి డ్రామా ఆడుతున్నారా. మిస్టరీగా మారిన ముగ్గురి మరణం.

Samayam Telugu 3 Jan 2019, 11:24 pm
విజయవాడలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం విషాదాన్ని నింపింది. మృతులు చెన్నై సమీపంలోని రాయవేలూరు చెందినవారిగా గుర్తించారు. చనిపోయినవారు క్యాబ్‌ డ్రైవర్‌ ధనశేఖర్‌ భార్య జయంతి, కుమార్తె శ్రీలక్ష్మి,పెద నాన్న గోపాలకృష్ణన్‌‌లుగా గుర్తించారు. డిసెంబర్ 27న వేలంగిమాత దర్శనం కోసం ధనశేఖర్ భార్య, తన కూతురితో కలిసి విజయవాడ వచ్చింది. గోపాలకృష్ణన్‌ తర్వాత నగరానికి చేరుకున్నారు. అనంతరం వీరంతా కలిసి వేలంగిమాతను దర్శించుకున్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu vja


అయితే ఈ ముగ్గురు ఉన్నట్టుండి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. ప్రాణాలు తీసుకోవాల్సినంత కష్టం ఏమొచ్చిందని అనుమానిస్తున్నారు. ఘటన గురించి తెలియగానే ధనశేఖర్, కుటుంబ సభ్యులు విజయవాడ చేరుకున్నారు. తన భార్య, కుమార్తె ఆత్మహత్యపై శేఖర్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విజయవాడ వచ్చాక వాళ్లు ఎక్కడెక్కడికి వెళ్లారు? ఏం చేశారనే వివరాలను సేకరిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీ కోసం ప్రయత్నిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.