యాప్నగరం

పండగపూట విషాదం: కేబుల్ వైర్‌కు కరెంటు.. ముగ్గురి మృతి

సోదరుడి గృహ ప్రవేశం కోసం వచ్చి తన ఇద్దరి పిల్లలతో సహా ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

Samayam Telugu 13 Sep 2018, 12:10 pm
Samayam Telugu గుంటూరు విషాదం
పండగ పూట గుంటూరు జిల్లాలో విషాదం నెలకుంది. ప్రత్తిపాడు మండ‌లం గనికపూడిలో విద్యుత్ షాక్‌కు ముగ్గురు ప్రాణాలు కాల్పోయిన ఘటన చోటుచేసుకుంది. గృహ ప్రవేశం కోసం ఏర్పాట్లు చేస్తుండగా, కేబుల్‌ వైరుకు విద్యుత్‌ ప్రవహించి తండ్రితో పాటు ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామానికి చెందిన ఏసు(28) తన సోదరుడు గృహ ప్రవేశం కోసం కుటుంబ సమేతంగా గనికపూడి వచ్చాడు. గురువారం ఉదయం కొత్త ఇంటిలోని కేబుల్‌ వైరును తాకడంతో అతడికి షాక్‌ కొట్టింది.

అతడి పక్కనే పిల్లలు ఉండటంతో వారు కూడా విద్యుదాఘాతానికి గురయ్యారు. దీంతో ఏసు, పాటు అతడి కుమారుడు సాల్మన్‌రాజు (5), కుమార్తె రాణి(4) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సోదరుడి ఇంటికి శుభకార్యానికి వచ్చి పిల్లలతో సహా మృత్యువాత పడటం అందరినీ విషాదంలోకి నెట్టేసింది. కుటుంబమంతా సంతోషంగా ఉండాల్సిన ఆ ఇంటిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.