పండగపూట విషాదం: కేబుల్ వైర్కు కరెంటు.. ముగ్గురి మృతి
సోదరుడి గృహ ప్రవేశం కోసం వచ్చి తన ఇద్దరి పిల్లలతో సహా ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
Samayam Telugu 13 Sep 2018, 12:10 pm
పండగ పూట గుంటూరు జిల్లాలో విషాదం నెలకుంది. ప్రత్తిపాడు మండలం గనికపూడిలో విద్యుత్ షాక్కు ముగ్గురు ప్రాణాలు కాల్పోయిన ఘటన చోటుచేసుకుంది. గృహ ప్రవేశం కోసం ఏర్పాట్లు చేస్తుండగా, కేబుల్ వైరుకు విద్యుత్ ప్రవహించి తండ్రితో పాటు ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామానికి చెందిన ఏసు(28) తన సోదరుడు గృహ ప్రవేశం కోసం కుటుంబ సమేతంగా గనికపూడి వచ్చాడు. గురువారం ఉదయం కొత్త ఇంటిలోని కేబుల్ వైరును తాకడంతో అతడికి షాక్ కొట్టింది.
అతడి పక్కనే పిల్లలు ఉండటంతో వారు కూడా విద్యుదాఘాతానికి గురయ్యారు. దీంతో ఏసు, పాటు అతడి కుమారుడు సాల్మన్రాజు (5), కుమార్తె రాణి(4) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సోదరుడి ఇంటికి శుభకార్యానికి వచ్చి పిల్లలతో సహా మృత్యువాత పడటం అందరినీ విషాదంలోకి నెట్టేసింది. కుటుంబమంతా సంతోషంగా ఉండాల్సిన ఆ ఇంటిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అతడి పక్కనే పిల్లలు ఉండటంతో వారు కూడా విద్యుదాఘాతానికి గురయ్యారు. దీంతో ఏసు, పాటు అతడి కుమారుడు సాల్మన్రాజు (5), కుమార్తె రాణి(4) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సోదరుడి ఇంటికి శుభకార్యానికి వచ్చి పిల్లలతో సహా మృత్యువాత పడటం అందరినీ విషాదంలోకి నెట్టేసింది. కుటుంబమంతా సంతోషంగా ఉండాల్సిన ఆ ఇంటిలో విషాదఛాయలు అలుముకున్నాయి.