యాప్నగరం

ఒకదాన్నొకటి ఢీకొన్న మూడు బస్సులు.. ఒకరు మృతి

ప్రయివేట్ ట్రావెల్స్‌కు చెందిన మూడు బస్సులు, ఓ కారు ఒకదానికొకటి ఢీకొన్న ఘటన కృష్ణా జిల్లా గరికపాడు వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.

Samayam Telugu 7 Aug 2018, 10:08 am
ప్రయివేట్ ట్రావెల్స్‌కు చెందిన మూడు బస్సులు, ఓ కారు ఒకదానికొకటి ఢీకొన్న ఘటన కృష్ణా జిల్లా గరికపాడు వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన మూడు బస్సులు, ఓ కారు ఒక్కదాన్నొకటి మంగళవారం తెల్లవారుజామున గరికిపాడు చెక్‌పోస్ట్ వద్ద ఢీకొన్నాయి. ఈ ఘటనలో జై భారత్ ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్ శ్రీనివాస్ మృతి చెందాడు. మూడు బస్సులోని 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. కావేరీ, ఎస్వీఆర్, జై భారత్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. క్షతగాత్రులను వెంటనే జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన 10 మంది క్షతగ్రాత్రులను మెరుగైన వైద్యం కోసం విజయవాడ సమీపంలోని ఆంధ్రా హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.
Samayam Telugu విజయవాడ వద్ద రోడ్డు ప్రమాదం


ప్రమాదం ఎలా చోటుచేసుకుందనేది ఇంకా తెలియరాలేదు. దీని గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. కేసు నమోదుచేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు పెను ప్రమాదం జరిగినా భారీ ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చెక్‌పోస్ట్ వద్ద మూడు ప్రయివేట్ బస్సులు వెనుక నుంచి ఒకదాన్నొకటి ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలియజేశారు. చెక్ పోస్ట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై కలెక్టర్ బి.లక్ష్మీ కాంతం స్పందించారు. గొల్లపూడిలోని ఆంధ్రా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదని కలెక్టర్ లక్ష్మీ కాంతం పేర్కోన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.