యాప్నగరం

మహూబూబ్‌నగర్‌‌: ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖ యువకులు మృతి

మహబూబ్‌నగర్‌ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మాగునూరు మండలం నల్లగట్టు సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

Samayam Telugu 10 Dec 2018, 10:31 am
మహబూబ్‌నగర్‌ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మాగునూరు మండలం నల్లగట్టు సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో విశాఖకు చెందిన అవినాష్‌ (26), అనిల్‌(26), అరవింద్‌(27) అనే యువకులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు స్నేహితులతో కలిసి వీరు కర్ణాటకలోని ఘోకర్ణ నుంచి హైదరాబాద్‌కు మహేంద్ర ఎక్స్‌యూవీ వాహనంలో వస్తుండగా నల్లగట్టు వద్ద నిర్మాణంలో ఉన్న ఓ కల్వర్టును ప్రమాదవశాత్తు వేగంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో అవినాష్‌, అనిల్‌, అరవింద్‌ అక్కడికక్కడే మృతిచెందగా.. మహేష్‌, మణికంఠ, కామేశ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్దరించారు.
Samayam Telugu accident


అంతేకాదు, రహదారిపై కల్వర్టు నిర్మాణంలో ఉన్న విషయం కూడా గుర్తించలేకపోవడంతోనే వాహనం అదుపుచేయలేకపోయారని అంటున్నారు. మృతుల బంధువులకు సమాచారం అందించినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం సమీపంలోని ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. వాహనం నడిపే సమయంలో యువకులు మద్యం సేవించి ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేసే వీళ్లు వీకెండ్ కావడంతో గోవాకు వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడ నుంచి ఘోకర్ణకు వెళ్లి, ఆదివారం రాత్రి హైదరాబాద్ బయలుదేరినట్టు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.