యాప్నగరం

పొలంలో పిడుగు.. తల్లీ, కొడుకు, కూతురు మృతి, తండ్రి పరిస్థితి విషమం

పొలం దగ్గర పనులు చేస్తున్న కుటుంబాన్ని పిడుగు రూపంలో మృత్యువు కబళించింది. తల్లి, కొడుకు, కూతురు అక్కడికక్కడే మృతి చెందగా.. తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. వికారాబాద్ జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది.

Samayam Telugu 20 May 2019, 8:00 pm
పిడుగుపాటుకు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పొలం దగ్గర పనులు చేస్తున్న కుటుంబాన్ని పిడుగు రూపంలో మృత్యువు కబళించింది. పిడుగుపాటుకు తల్లి, కొడుకు, కూతురు అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. వికారాబాద్ జిల్లాలోని థరూర్ మండలం రాజాపూర్ గ్రామంలో సోమవారం (మే 20) మధ్యాహ్నం ఈ విషాదం చోటుచేసుకుంది..
Samayam Telugu Vikarabad


పొలం వద్ద పనులు చేస్తుండగా పిడుగు పడటంతో మహిళ ఖాజాబీ (39), కూతురు తబుస్సుం (15), కుమారుడు అక్రమ్ (12) అక్కడికక్కడే చెందారు. తీవ్ర గాయాలపాలైన ఫక్రుద్దీన్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు దుర్మరణం పాలవడంతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.